టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాల గురించి రకరకాల లీకులు, ప్రచారాలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తో డ్రాప్ అయిన ఫాంటసీ మూవీని త్రివిక్రమ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. మాటల మాంత్రికుడు, వెంకటేష్ కాంబో కూడా ఈ మధ్యలో లాకైపోయింది. ఈ రెండు హారికా హాసినీ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. ఎటొచ్చి రామ్ చరణ్ ది మాత్రం రెండు రోజుల సందడికి పరిమితమై తర్వాత లేదనిపించుకుంది. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తావన ఎందుకొచ్చిందో చూద్దాం. ప్రస్తుతం తను స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదయ్యాక సందీప్ వంగా చేయాల్సిన మూవీ యానిమల్ పార్క్. కానీ రన్బీర్ కపూర్ రామాయణం రెండు భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4లతో ఇంకో మూడేళ్లు దొరికే పరిస్థితిలో లేడు. ఇంకోవైపు రామ్ చరణ్ తో ఎప్పటి నుంచో సినిమా ప్లానింగ్ లో ఉన్న యువి క్రియేషన్స్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో దాన్ని సాధ్యం చేయాలనుకుంది. కానీ కథ పూర్తిగా సంతృప్తి పరచని కారణంతో పాటు గేమ్ చేంజర్ వల్ల ఇది కాస్తా విజయ్ దేవరకొండకు వెళ్ళిపోయింది. అయితే సందీప్ వంగా దగ్గర అర్జున్ రెడ్డి టైంలోనే యువి దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ఉంది. ఆ కమిట్ మెంట్ ఎప్పటికైనా పూర్తి చేయాలనేది ఒప్పందం.
సో ఇప్పుడు రామ్ చరణ్, సందీప్ వంగాలను కలిపేస్తే యువికి ఒకే దెబ్బకు రెండు జాక్ పాట్లు తగులుతాయి. ఈ కలయిక నిజమవ్వడం వెనుక ప్రభాస్ పాత్ర ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సందీప్ వంగా, యువి క్రియేషన్స్ విక్రమ్, రామ్ చరణ్ ముగ్గురికి మంచి దోస్తీ ఉంది. కాబట్టి సాధ్యమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. పెద్ది అయ్యాక చరణ్ ఎవరితో చేస్తాడనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. సుకుమార్ కనక త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేస్తే ఆర్సి 17లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో, స్పిరిట్ అయ్యేలోపు చరణ్ ఇంకో సినిమా చేసుకోవచ్చు. అది త్రివిక్రమా లేక కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్టా అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on June 12, 2025 9:24 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…