టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాల గురించి రకరకాల లీకులు, ప్రచారాలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తో డ్రాప్ అయిన ఫాంటసీ మూవీని త్రివిక్రమ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. మాటల మాంత్రికుడు, వెంకటేష్ కాంబో కూడా ఈ మధ్యలో లాకైపోయింది. ఈ రెండు హారికా హాసినీ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. ఎటొచ్చి రామ్ చరణ్ ది మాత్రం రెండు రోజుల సందడికి పరిమితమై తర్వాత లేదనిపించుకుంది. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తావన ఎందుకొచ్చిందో చూద్దాం. ప్రస్తుతం తను స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదయ్యాక సందీప్ వంగా చేయాల్సిన మూవీ యానిమల్ పార్క్. కానీ రన్బీర్ కపూర్ రామాయణం రెండు భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4లతో ఇంకో మూడేళ్లు దొరికే పరిస్థితిలో లేడు. ఇంకోవైపు రామ్ చరణ్ తో ఎప్పటి నుంచో సినిమా ప్లానింగ్ లో ఉన్న యువి క్రియేషన్స్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో దాన్ని సాధ్యం చేయాలనుకుంది. కానీ కథ పూర్తిగా సంతృప్తి పరచని కారణంతో పాటు గేమ్ చేంజర్ వల్ల ఇది కాస్తా విజయ్ దేవరకొండకు వెళ్ళిపోయింది. అయితే సందీప్ వంగా దగ్గర అర్జున్ రెడ్డి టైంలోనే యువి దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ఉంది. ఆ కమిట్ మెంట్ ఎప్పటికైనా పూర్తి చేయాలనేది ఒప్పందం.
సో ఇప్పుడు రామ్ చరణ్, సందీప్ వంగాలను కలిపేస్తే యువికి ఒకే దెబ్బకు రెండు జాక్ పాట్లు తగులుతాయి. ఈ కలయిక నిజమవ్వడం వెనుక ప్రభాస్ పాత్ర ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సందీప్ వంగా, యువి క్రియేషన్స్ విక్రమ్, రామ్ చరణ్ ముగ్గురికి మంచి దోస్తీ ఉంది. కాబట్టి సాధ్యమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. పెద్ది అయ్యాక చరణ్ ఎవరితో చేస్తాడనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. సుకుమార్ కనక త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేస్తే ఆర్సి 17లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో, స్పిరిట్ అయ్యేలోపు చరణ్ ఇంకో సినిమా చేసుకోవచ్చు. అది త్రివిక్రమా లేక కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్టా అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on June 12, 2025 9:24 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…