మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి మాములుగా లేదు. అల్లు అర్జున్ తో ఫాంటసీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు చేరడం దగ్గరి నుంచి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్ – త్రివిక్రమ్ కలయిక దాకా లీకులన్నీ ప్రచారాలుగా మారిపోయాయి. అయితే రామ్ చరణ్ తో కూడా ఒక మూవీ ఉంటుందనే వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది. పెద్ది తర్వాత, సుకుమార్ ఆర్సి 17 కన్నా ముందు ఈ కాంబో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు గట్టిగానే చెప్పాయి. కానీ సితార, హారిక హాసిని నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చింది.
అందులో చెప్పిన ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం కమిట్ మెంట్ ఇచ్చిన హీరోలు ఇద్దరే. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్. మిగిలినవి ఊహాగానాలు మాత్రమేనని, ఏదైనా ఉంటే మళ్ళీ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తామని నాగవంశీ కుండబద్దలు కొట్టేశారు. ఇది మెగా ఫ్యాన్స్ కి కొంత నిరాశ కలిగించే విషయమే అయినా అంత తేలిగ్గా కొట్టి పారేయడానికి లేదు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు చరణ్ – త్రివిక్రమ్ కలయికకు ప్రతిపాదన జరిగిన మాట వాస్తవమే కానీ అదెప్పుడు, ఎంత టైం పడుతుంది, రాబోయే ఏడాదిలో ఉంటుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్స్. అప్పటిదాకా వెంకీ, తారక్ మాత్రం అఫీషియల్ లిస్టులో ఉంటారు.
వెంకటేష్ ప్రస్తుతం రెస్టులో ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాకి వచ్చే నెల శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు మెగా 157లోనూ వెంకీ మామ నటించబోతున్నాడు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, వాసు లాంటి సినిమాలకు అద్భుతమైన మాటలు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా వెంకటేష్ నే డైరెక్ట్ చేయనుండటంతో అభిమానుల అంచనాలు మాములుగా ఉండబోవడం లేదు. హారిక హాసిని సంస్థ దీన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్యాస్టింగ్ ని ఫైనల్ చేసుకున్నాక అనౌన్స్ మెంట్ ఇస్తారు. ముహూర్తం తేదీ తదితరాలు ఇంకా నిర్ణయించుకోలేదని టాక్.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…