మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి మాములుగా లేదు. అల్లు అర్జున్ తో ఫాంటసీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు చేరడం దగ్గరి నుంచి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్ – త్రివిక్రమ్ కలయిక దాకా లీకులన్నీ ప్రచారాలుగా మారిపోయాయి. అయితే రామ్ చరణ్ తో కూడా ఒక మూవీ ఉంటుందనే వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది. పెద్ది తర్వాత, సుకుమార్ ఆర్సి 17 కన్నా ముందు ఈ కాంబో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు గట్టిగానే చెప్పాయి. కానీ సితార, హారిక హాసిని నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చింది.
అందులో చెప్పిన ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం కమిట్ మెంట్ ఇచ్చిన హీరోలు ఇద్దరే. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్. మిగిలినవి ఊహాగానాలు మాత్రమేనని, ఏదైనా ఉంటే మళ్ళీ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తామని నాగవంశీ కుండబద్దలు కొట్టేశారు. ఇది మెగా ఫ్యాన్స్ కి కొంత నిరాశ కలిగించే విషయమే అయినా అంత తేలిగ్గా కొట్టి పారేయడానికి లేదు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు చరణ్ – త్రివిక్రమ్ కలయికకు ప్రతిపాదన జరిగిన మాట వాస్తవమే కానీ అదెప్పుడు, ఎంత టైం పడుతుంది, రాబోయే ఏడాదిలో ఉంటుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్స్. అప్పటిదాకా వెంకీ, తారక్ మాత్రం అఫీషియల్ లిస్టులో ఉంటారు.
వెంకటేష్ ప్రస్తుతం రెస్టులో ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాకి వచ్చే నెల శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు మెగా 157లోనూ వెంకీ మామ నటించబోతున్నాడు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, వాసు లాంటి సినిమాలకు అద్భుతమైన మాటలు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా వెంకటేష్ నే డైరెక్ట్ చేయనుండటంతో అభిమానుల అంచనాలు మాములుగా ఉండబోవడం లేదు. హారిక హాసిని సంస్థ దీన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్యాస్టింగ్ ని ఫైనల్ చేసుకున్నాక అనౌన్స్ మెంట్ ఇస్తారు. ముహూర్తం తేదీ తదితరాలు ఇంకా నిర్ణయించుకోలేదని టాక్.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…