నిన్న జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అందరి కంటే తక్కువ మాట్లాడింది హీరో నితినే. పోయినసారి ఎక్కువ మాట్లాడానంటూ, ఈసారి సినిమా మాట్లాడాలి కాబట్టి సక్సెసయ్యాక పంచుకుంటానంటూ సింపుల్ గా పక్కకు తప్పుకున్నాడు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్, ఆర్టిస్ట్ లయతో పాటు ఇతర తారాగణం చెప్పుకోదగ్గ స్పీచులు ఇచ్చినా సరే నితిన్ మాత్రం వాళ్లలో సగం కూడా హడావిడి చేయలేదు. నిజానికీ మార్పుకు కారణం వరసగా వస్తున్న ఫెయిల్యూర్సే. ముఖ్యంగా రాబిన్ హుడ్ చాలా పెద్ద దెబ్బ కొట్టింది. నెలరోజులకు పైగా నితిన్ దాని కోసం అగ్రెసివ్ ప్రమోషన్లు చేశాడు.
రీల్స్, మీమ్స్, వెరైటీ ఇంటర్వ్యూలు, స్పూఫులు ఏదీ కాదనకుండా క్రియేటివ్ టీమ్ ఏది అడిగితే అది సంపూర్ణంగా నెరవేర్చాడు. కారణం సింపుల్. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల మీద నమ్మకం. కానీ రాబిన్ హుడ్ ఘోరంగా డిజాస్టరయ్యింది. యావరేజ్ అయినా కొంత ఊరట దక్కేది కానీ సాయంత్రం షోకే చేతులు ఎత్తేసింది. మైత్రి సంస్థ అంత బడ్జెట్ పెడితే కనీసం పావొంతు రికవర్ కాకపోవడం కన్నా ట్రాజెడీ ఏముంటుంది. అంతకు ముందు ఎక్స్ ట్రాడినరి మ్యాన్, మాచర్ల నియోజవర్గం కోసం కూడా నితిన్ ఇంతే కష్టపడ్డాడు. కానీ ఫలితాలు మాత్రం రిపీటవుతూనే వచ్చాయి.
ఎట్టకేలకు నితిన్ కు తత్వం బోధ పడింది. హడావిడి చేయడం కన్నా సినిమా విజయం సాధించాక మాట్లాడ్డం బెటరని డిసైడయ్యాడు. ఇది ఒకందుకు మంచిదే. తమ్ముడు కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ని టార్గెట్ చేసుకున్న వైనం వర్కౌట్ అయితే వసూళ్లు వస్తాయి. అందులోనూ సంక్రాంతి పండగా తర్వాత అన్ని వర్గాలను కదిలించిన మాస్ సినిమా ఒక్కటి రాలేదు. సిస్టర్ సెంటిమెంట్, ఎలివేషన్లు, అజనీష్ లోకనాథ్ సంగీతం లాంటి ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కనక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే నితిన్ ఎదురుచూపులు తీరినట్టే. జూలై 4 ఈ సస్పెన్స్ వీగిపోనుంది.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…