Movie News

వైట్ల అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చినా..

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఆ సంస్థలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. డిజాస్టర్లూ ఉన్నాయి. ఐతే మైత్రీ సంస్థ ప్రొడ్యూస్ చేసిన వాటిలో  అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన చిత్రాల్లో ఒకటిగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని చెప్పొచ్చు. 2018లో విడుదలైన ఈ చిత్రంపై అప్పట్లోనే రూ.40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కరవయ్యాయి. ఆ సమయానికి రవితేజ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఫామ్‌లో లేని శ్రీను వైట్లను నమ్మి గట్టి ఎదురు దెబ్బే తింది మైత్రీ సంస్థ. 

ఇలాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నిర్మాణ సంస్థ మళ్లీ పని చేయడం కష్టమే. కానీ మైత్రీ అధినేతలు మాత్రం వైట్లకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత ఐదేళ్ల పాటు కనిపించకుండా పోయిన వైట్ల.. తర్వాత చాలా కష్టపడి ‘విశ్వం’ సినిమాను సెట్ చేసుకున్నాడు. దానికీ మేకింగ్ మధ్యలో ఇబ్బందులు తలెత్తాయి. పీపుల్స్ మీడియా సంస్థ సాయంతో బయటపడ్డాడు. గత ఏడాది చివర్లో రిలీజైన ‘విశ్వం’ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. వైట్ల గత చిత్రాల్లాగా డిజాస్టర్ అయితే కాలేదు. 

దీంతో ఆయనకు లైఫ్ లైన్ దొరికినట్లయింది. మైత్రీ సంస్థలో ఒక సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందట. ‘సామజవరగమన’ రైటర్లు భాను-నందులతో కలిసి వైట్ల ఒక స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. వీళ్లిద్దరూ ‘విశ్వం’కు పని చేస్తున్నపుడే.. వైట్లతో కలిసి మరో కథనూ రెడీ చేశారట. ఆ కథే మైత్రీ వద్దకు వెళ్లి ఓకే అయింది. ఇక హీరోను ఎంచుకోవడమే తరువాయి. ప్రస్తుతం వైట్ల ఆ పనిలోనే ఉన్నాడు. త్వరలోనే హీరోను ఫైనలైజ్ చేసి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.

This post was last modified on June 10, 2025 3:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

1 hour ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

1 hour ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

5 hours ago