Movie News

వైట్ల అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చినా..

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఆ సంస్థలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. డిజాస్టర్లూ ఉన్నాయి. ఐతే మైత్రీ సంస్థ ప్రొడ్యూస్ చేసిన వాటిలో  అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన చిత్రాల్లో ఒకటిగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని చెప్పొచ్చు. 2018లో విడుదలైన ఈ చిత్రంపై అప్పట్లోనే రూ.40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కరవయ్యాయి. ఆ సమయానికి రవితేజ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఫామ్‌లో లేని శ్రీను వైట్లను నమ్మి గట్టి ఎదురు దెబ్బే తింది మైత్రీ సంస్థ. 

ఇలాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నిర్మాణ సంస్థ మళ్లీ పని చేయడం కష్టమే. కానీ మైత్రీ అధినేతలు మాత్రం వైట్లకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత ఐదేళ్ల పాటు కనిపించకుండా పోయిన వైట్ల.. తర్వాత చాలా కష్టపడి ‘విశ్వం’ సినిమాను సెట్ చేసుకున్నాడు. దానికీ మేకింగ్ మధ్యలో ఇబ్బందులు తలెత్తాయి. పీపుల్స్ మీడియా సంస్థ సాయంతో బయటపడ్డాడు. గత ఏడాది చివర్లో రిలీజైన ‘విశ్వం’ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. వైట్ల గత చిత్రాల్లాగా డిజాస్టర్ అయితే కాలేదు. 

దీంతో ఆయనకు లైఫ్ లైన్ దొరికినట్లయింది. మైత్రీ సంస్థలో ఒక సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందట. ‘సామజవరగమన’ రైటర్లు భాను-నందులతో కలిసి వైట్ల ఒక స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. వీళ్లిద్దరూ ‘విశ్వం’కు పని చేస్తున్నపుడే.. వైట్లతో కలిసి మరో కథనూ రెడీ చేశారట. ఆ కథే మైత్రీ వద్దకు వెళ్లి ఓకే అయింది. ఇక హీరోను ఎంచుకోవడమే తరువాయి. ప్రస్తుతం వైట్ల ఆ పనిలోనే ఉన్నాడు. త్వరలోనే హీరోను ఫైనలైజ్ చేసి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.

This post was last modified on June 10, 2025 3:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago