ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కింగ్ డమ్ మళ్ళీ వాయిదా పడింది. ముందు ఈ సినిమా కోసమే తమ డేట్ ని త్యాగం చేసిన నితిన్ తమ్ముడు తిరిగి జూలై 4ని తీసేసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించడమే కాక ఎల్లుండి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఇది ముందే పసిగట్టిన విషయమే అయినప్పటికీ సితార సంస్థ మాటకు కట్టుబడి ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశించారు. కానీ దానికి భిన్నంగా మళ్ళీ వాయిదా మంత్రం తప్పలేదు. హరిహర వీరమల్లు జూలై 18 రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో కింగ్ డమ్ ఆగస్ట్ 1కి షిఫ్ట్ అవుతుందని లేటెస్ట్ అప్డేట్. తేజ సజ్జ మిరాయ్ వదిలేసిన స్లాట్ ఇది.
సరే ఇంకో రెండు నెలలు లేట్ అయితే అయ్యింది కంటెంట్ బాగుంటే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఇక్కడింకో సమస్య ఉంది. ఒకవేళ కింగ్ డమ్ కనక ఆగస్ట్ 1 రిలీజైతే కేవలం పదమూడు రోజులు దాటడం ఆలస్యం ఒకే రోజు వార్ 2, కూలి దిగుతాయి. వాటి మీద బజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. కింగ్ డమ్ ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా ఆగస్ట్ 14 నుంచి స్క్రీన్లను కాపాడుకోవడం పెద్ద సవాల్ అవుతుంది. సరే డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది కాబట్టి ఏదోలా మేనేజ్ చేసినా ప్రేక్షకుల దృష్టి వార్, కూలీ మీదే ఎక్కువ ఉంటాయనేది కాదనలేని వాస్తవం. సో ఆటోమేటిక్ గా డైవెర్షన్ జరిగిపోతుంది.
మార్చి నుంచి వాయిదాల పర్వంలో తడుస్తూ వచ్చిన కింగ్ డమ్ కు కేవలం పక్క సినిమాల వల్లే డేట్లు మిస్ కాలేదు. కొంత రీ షూట్ చేయాల్సి వచ్చింది. రీ రికార్డింగ్ కోసం అనిరుధ్ రవిచందర్ ఎక్కువ సమయం అడిగాడు. ప్రమోషన్లు ప్యాన్ ఇండియా స్థాయిలో జరగాలంటే కనీసం నెల రోజుల గడువు దొరకాలి. పోస్ట్ ప్రొడక్షన్ కి టైం చాలడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హడావిడి వద్దని నెమ్మదిగా రావాలని సితార టీమ్ నిర్ణయించుకుందట. శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ తమిళులకు బాగా కనెక్ట్ అవుతుంది. మరి కూలికి పదమూడు రోజుల ముందు రావడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on June 9, 2025 3:24 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…