పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం.. ఫౌజీ. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం.. దీని కథా నేపథ్యం.. బడ్జెట్.. అన్నీ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దీన్ని ట్రూ పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్న హను.. వివిధ భాషల నుంచి ముఖ్య పాత్రల కోసం ఆర్టిస్టులను తీసుకుంటున్నాడు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకుముందు ‘కార్తికేయ-2’లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి మెప్పించిన అనుపమ్.. దాని తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఆయన ‘ఫౌజీ’ సెట్స్లోకి అడుగు పెట్టారు. కానీ మామూలుగా కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఏ సినిమా సెట్స్లోకి అడుగు పెట్టని విధంగా ఆయన ఎంట్రీ జరిగింది.
హైదరాబాద్ శివార్లలో అడవిలో ఉన్న ప్రాంతంలో ‘ఫౌజీ’ షూట్ జరుగుతోంది. అక్కడికి చేరుకునేందుకు అనుమప్ కోసం కారును పంపారు నిర్మాతలు. ఐతే డ్రైవర్ దారి తప్పి షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి దగ్గర్లో ఇరుక్కుపోయాడు. అది డెడ్ ఎండ్. కారును రివర్స్ చేయడానికి కూడా వీలు పడని పరిస్థితి. ఐతే సమీపంలోనే ఒక పెద్ద గోడకు అవతల ‘ఫౌజీ’ షూట్ జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో అనుపమ్ కోసం గోడకు ఇవతల ఒక నిచ్చెన వేసి.. దాని ద్వారా లొకేషన్లోకి తీసుకొచ్చింది ప్రొడక్షన్ టీం.
తమ డ్రైవర్ ఈ ప్రయాణాన్ని అడ్వెంచరస్గా మార్చాలని అనుకున్నాడని.. దీంతో ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ లేని విధంగా, చాలా తమాషాగా ‘ఫౌజీ’ సెట్స్లోకి తన ఎంట్రీ జరిగిందని అనుపమ్ ఒక వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా 30 శాతం మేర పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ సరసన కొత్తమ్మాయి ఇమాన్వి నటిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్ల పైమాటే అని సమాచారం.
This post was last modified on June 8, 2025 4:46 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…