పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం.. ఫౌజీ. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం.. దీని కథా నేపథ్యం.. బడ్జెట్.. అన్నీ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దీన్ని ట్రూ పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్న హను.. వివిధ భాషల నుంచి ముఖ్య పాత్రల కోసం ఆర్టిస్టులను తీసుకుంటున్నాడు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకుముందు ‘కార్తికేయ-2’లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి మెప్పించిన అనుపమ్.. దాని తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఆయన ‘ఫౌజీ’ సెట్స్లోకి అడుగు పెట్టారు. కానీ మామూలుగా కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఏ సినిమా సెట్స్లోకి అడుగు పెట్టని విధంగా ఆయన ఎంట్రీ జరిగింది.
హైదరాబాద్ శివార్లలో అడవిలో ఉన్న ప్రాంతంలో ‘ఫౌజీ’ షూట్ జరుగుతోంది. అక్కడికి చేరుకునేందుకు అనుమప్ కోసం కారును పంపారు నిర్మాతలు. ఐతే డ్రైవర్ దారి తప్పి షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి దగ్గర్లో ఇరుక్కుపోయాడు. అది డెడ్ ఎండ్. కారును రివర్స్ చేయడానికి కూడా వీలు పడని పరిస్థితి. ఐతే సమీపంలోనే ఒక పెద్ద గోడకు అవతల ‘ఫౌజీ’ షూట్ జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో అనుపమ్ కోసం గోడకు ఇవతల ఒక నిచ్చెన వేసి.. దాని ద్వారా లొకేషన్లోకి తీసుకొచ్చింది ప్రొడక్షన్ టీం.
తమ డ్రైవర్ ఈ ప్రయాణాన్ని అడ్వెంచరస్గా మార్చాలని అనుకున్నాడని.. దీంతో ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ లేని విధంగా, చాలా తమాషాగా ‘ఫౌజీ’ సెట్స్లోకి తన ఎంట్రీ జరిగిందని అనుపమ్ ఒక వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా 30 శాతం మేర పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ సరసన కొత్తమ్మాయి ఇమాన్వి నటిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్ల పైమాటే అని సమాచారం.
This post was last modified on June 8, 2025 4:46 pm
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…