సమంత కెరీర్లో ‘ఏమాయ చేసావె’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ఆ చిత్రంతోనే తన కెరీర్ గొప్ప మలుపు తిరిగింది. తెలుగులో పెద్ద బ్రేక్ వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది సమంత. తర్వాతి కాలంలో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్న నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది కూడా ఈ సినిమాతోనే. అందుకే ‘ఏమాయ చేసావె’ను తన జీవితంలో చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెబుతూ ఉండేది సమంత. ఈ క్రమంలోనే ఆమె తన మెడ మీద ‘వైఎంసీ’ అని ఇంగ్లిష్ అక్షరాలతో పచ్చబొట్టు కూడా వేయించుకుంది. నాగచైతన్య నుంచి విడిపోయాక కూడా ఈ పచ్చబొట్టు అలాగే కొనసాగింది. కానీ ఇప్పుడు ఆమె ఒంటి మీది నుంచి ఆ పచ్చబొట్టు ఎగిరిపోవడం గమనార్హం.
సమంత తాజాగా ఒక ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. దానికి ‘ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది’ అనే క్యాప్షన్ కూడా రిలీజ్ చేసింది. సమంత చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న వీడియోలో.. అందరి దృష్టీ తన మెడ మీదికి వెళ్లింది. అక్కడ గతంలో హైలైట్ అవుతూ వచ్చిన ‘వైఎంసీ’ అనే అక్షరాలు మాయం అయ్యాయి.
నాగచైతన్యకు సంబంధించిన గురుతులేవీ తన దగ్గర ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఆమె ఈ పచ్చబొట్టును చెరిపివేయించుకుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు నడుము మీద ఉన్న ‘చై’ అనే పచ్చబొట్టును ఆమె తీయించేసుకుంది. ప్రస్తుతం సమంత.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లయిన రాజ్.. తన మొదటి భార్య నుంచి విడిపోయి సమంతను పెళ్లాడబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలోనే సమంత ఇలా పచ్చబొట్టును చెరిపేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on June 7, 2025 6:06 pm
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…