పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ వచ్చే వారం విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా మరోసారి వాయిదా పడింది. అలా అని చిత్ర బృందం ప్రమోషన్లు ఏమీ ఆపేయలేదు. నిన్న దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ కలిసి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అక్కడ అసలు కార్యక్రమం కంటే.. ‘హరిహర వీరమల్లు’ గురించి జ్యోతికృష్ణ చేసిన ప్రసంగమే హైలైట్ అయింది. ఆ కార్యక్రమం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లా మారిపోవడం విశేషం.
తన ప్రసంగంలో జ్యోతికృష్ణ అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. తొలిసారిగా ఈ సినిమా బడ్జెట్ గురించి అతను వెల్లడించాడు. ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించాడు. సినిమాలో హైలైట్ల గురించి మాట్లాడుతూ.. పవన్ కొన్ని నెలల కిందట కాకినాడలో అన్న ‘సీజ్ ద షిప్’ డైలాగ్ను గుర్తు చేసుకుని.. దాన్ని తలపించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను సినిమాలో తీర్చిదిద్దినట్లు వెల్లడించాడు జ్యోతికృష్ణ. సినిమాలో మచిలీపట్నం పోర్ట్ నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని జ్యోతికృష్ణ చెప్పాడు.
తెల్లవాళ్లు మన సంపదను దోచుకుపోతుంటే.. పవన్ వచ్చి వాళ్లకు బుద్ధి చెప్పి ‘సీజ్ ద షిప్’ అనే మాటను రీ క్రియేట్ చేసినట్లుగా ఈ ఎపిసోడ్ ఉంటుందని జ్యోతికృష్ణ తెలిపాడు. ఇంకా పవన్ నిజ జీవితానికి రిలేట్ అయ్యేలా అనేక సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని జ్యోతికృష్ణ అన్నాడు. ఈ సినిమాలో మచిలీపట్నం పోర్టును చూశాక ఆంధ్రా అనే కాక దేశమంతా దద్దరిల్లిపోతుందని అతను వ్యాఖ్యానించాడు. ‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ మూడుసార్లు చూశాడని.. తనను గంటసేపు పొగిడాడని.. తనతో ఇంకో సినిమా చేయాలని ఉందని కూడా చెప్పాడని జ్యోతికృష్ణ పేర్కొన్నాడు.
This post was last modified on June 7, 2025 3:19 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…