Movie News

‘హరిహర వీరమల్లు’లో సీజ్ ద షిప్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ వచ్చే వారం విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా మరోసారి వాయిదా పడింది. అలా అని చిత్ర బృందం ప్రమోషన్లు ఏమీ ఆపేయలేదు. నిన్న దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. అక్కడ అసలు కార్యక్రమం కంటే.. ‘హరిహర వీరమల్లు’ గురించి జ్యోతికృష్ణ చేసిన ప్రసంగమే హైలైట్ అయింది. ఆ కార్యక్రమం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లా మారిపోవడం విశేషం.

తన ప్రసంగంలో జ్యోతికృష్ణ అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. తొలిసారిగా ఈ సినిమా బడ్జెట్ గురించి అతను వెల్లడించాడు. ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించాడు. సినిమాలో హైలైట్ల గురించి మాట్లాడుతూ.. పవన్ కొన్ని నెలల కిందట కాకినాడలో అన్న ‘సీజ్ ద షిప్’ డైలాగ్‌ను గుర్తు చేసుకుని.. దాన్ని తలపించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను సినిమాలో తీర్చిదిద్దినట్లు వెల్లడించాడు జ్యోతికృష్ణ. సినిమాలో మచిలీపట్నం పోర్ట్ నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని జ్యోతికృష్ణ చెప్పాడు.

తెల్లవాళ్లు మన సంపదను దోచుకుపోతుంటే.. పవన్ వచ్చి వాళ్లకు బుద్ధి చెప్పి ‘సీజ్ ద షిప్’ అనే మాటను రీ క్రియేట్ చేసినట్లుగా ఈ ఎపిసోడ్ ఉంటుందని జ్యోతికృష్ణ తెలిపాడు. ఇంకా పవన్ నిజ జీవితానికి రిలేట్ అయ్యేలా అనేక సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని జ్యోతికృష్ణ అన్నాడు. ఈ సినిమాలో మచిలీపట్నం పోర్టును చూశాక ఆంధ్రా అనే కాక దేశమంతా దద్దరిల్లిపోతుందని అతను వ్యాఖ్యానించాడు. ‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ మూడుసార్లు చూశాడని.. తనను గంటసేపు పొగిడాడని.. తనతో ఇంకో సినిమా చేయాలని ఉందని కూడా చెప్పాడని జ్యోతికృష్ణ పేర్కొన్నాడు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

5 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

7 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

8 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

8 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

8 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

9 hours ago