తాజాగా విడుదలైన థగ్ లైఫ్ లో త్రిష పాత్రను చూశాక అభిమానుల నుంచి ముక్తకంఠంతో వినిపిస్తున్న కోరిక ఇదొక్కటే. విడుదలకు ముందు ట్రైలర్ చూశాక తను కమల్ హాసన్ తో రొమాన్స్ చేయడం గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మీమ్స్ వచ్చాయి. ఇదే విషయం తనను ఇంటర్వ్యూలో అడిగితే తెరమీద చూడండి, థ్రిల్ అయ్యే ట్విస్టు ఉంటుందని చెప్పింది. తీరా చూస్తే ఇటు కమల్ అటు శింబు ఇద్దరితో రొమాన్స్ పెట్టిన దర్శకుడు మణిరత్నం అసలేం చెప్పాలనుకున్నాడో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. పైగా త్రిష క్యారెక్టర్ కిచ్చిన ఎండింగ్ చూశాక నోటమాట రావడం కష్టమే.
సెకండ్ సెటప్, వేశ్యగా స్టార్ హీరోయిన్లను చూపించడం కొత్త కాదు. ఆ మాటకొస్తే వేదంలో అనుష్క ఎంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందో ఎవరూ మర్చిపోలేం. కానీ థగ్ లైఫ్ లో త్రిషకు అంత స్కోప్ దొరకలేదు. అసలు మణిరత్నం టేస్ట్ ఇంతగా పడిపోయిందా అని చెప్పేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. జైలు నుంచి బయటికి వచ్చిన కమల్ హాసన్ మూడు రోజులు త్రిష ఇంట్లోనే గడుపుతాడు. వాళ్ళ బంధం గురించి బయట వృద్ధురాలైన వడవుక్కరసి వర్ణించడం వింటే బి గ్రేడ్ కంటే అన్యాయంగా ఉంటాయి. అసలీ పాత్ర లేకపోయినా కథకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేలా త్రిషని చూపించడం ట్రాజెడీ.
సరే తమిళంలో ఎలా చూపించినా ఓకే కానీ త్రిష నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా విశ్వంభర. చిరంజీవి హీరో అందులోనూ ఫాంటసీ మూవీ కనక తగినంత ప్రాధాన్యం దక్కి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీతో ఓ మోస్తరు హిట్ థగ్ లైఫ్ తో అల్ట్రా డిజాస్టర్ అందుకున్న త్రిషకు మెగా మూవీ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. దీంతో పాటు మోహన్ లాల్ తో కలిసి నటించిన రామ్ కూడా లైన్ లో ఉంది. కాకపోతే షూట్ ఇంకా బాలన్స్ ఉంది. పొన్నియిన్ సెల్వన్ లో ఎంతో అందంగా చూపించిన మణిరత్నమే ఇప్పుడీ థగ్ లైఫ్ ఇంత చెత్తగా చూపించడాన్ని సగటు ప్రేక్షకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on June 6, 2025 5:22 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…