హరిహర వీరమల్లు వాయిదా వార్తలు ప్రచారంలోకి రాగానే ఇప్పుడు అందరి కన్ను కొత్త డేట్లు ఏమై ఉంటాయనే దాని మీద ఉంది. వాటిలో మొదటిది జూన్ 27. మంచు విష్ణు కన్నప్ప ఆల్రెడీ అన్ని రకాల మార్కెటింగులు, థియేటర్ అగ్రిమెంట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. ప్రభాస్ లాంటి కీలక ఆర్టిస్టుల డబ్బింగ్ తప్ప మొత్తం పూర్తయ్యిందని టాక్. దానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ చేసుకున్న విష్ణు మరోసారి తప్పుకునే ఉద్దేశంలో ఎంత మాత్రం లేడని సన్నిహితుల సమాచారం. నెక్స్ట్ ఆప్షన్ జూలై 4. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కోసం అఫీషియల్ గా దాన్ని లాక్ చేసుకుని పెట్టుకున్నారు.
ఒకవేళ హరిహర వీరమల్లు కోసం ఆ డేట్ కావాలంటే విజయ్ దేవరకొండ త్యాగం తప్పకపోవచ్చు. ఎందుకంటే సితార సంస్థతో పవన్ కున్న అనుబంధం, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం లాంటి కారణాలు ఖచ్చితంగా రాజీ పడేలా చేస్తాయి. అదే కనక జరిగితే కింగ్ డమ్ అదే నెల రెండు లేదా మూడో వారంకు వెళ్లాల్సి ఉంటుంది. ఎలాగూ ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన పనులు పెండింగ్ ఉన్నాయి. చేతిలో ఉన్న 29 రోజుల్లో అన్ని పూర్తి చేసి ప్రమోషన్లకు సరిపడా సమయాన్ని ఉంచుకుంటారా లేదానే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. టీమ్ అయితే అన్నీ ప్లానింగ్ ప్రకారం పూర్తవుతాయని అంటోంది.
ఎట్టి పరిస్థితుల్లో వీరమల్లు ఇంకో నెల కంటే ఎక్కువ ఆలస్యం చేయడానికి లేదు. ఎందుకంటే ఆగస్ట్ లో అస్సలు ఛాన్స్ లేదు. వార్ 2, కూలి, మాస్ జాతరలు ఆ నెలలో ఉన్నాయి. అసలు అంత లేట్ అంటే ఓటిటి హక్కులు కొన్న ప్రైమ్ నుంచి మద్దతు దొరక్కపోవచ్చు. అసలు ఇప్పుడే ఇవ్వాలనుకున్న మొత్తంలోనే కోత ఉంటుందనే టాక్ పరిశ్రమ వర్గాల్లో ఉంది. సో ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా వీరమల్లు మహా ఇరకాటంలో పడ్డాడు. ఇప్పటికైతే మెగా సూర్య ప్రొడక్షన్స్ నుంచి అఫీషియల్ నోట్ రాలేదు కానీ టాలీవుడ్ మొత్తం ఇదే టాపిక్ డిస్కస్ చేసుకుంటోంది. చూడాలి మరి ఇంకేం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.
This post was last modified on June 3, 2025 5:26 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…