Movie News

వీరమల్లు.. ఒక్క ఎపిసోడ్‌కు 20 కోట్లు

తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఇంకో పది రోజుల్లోనే ఆ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. షూట్ చాలా ఆలస్యం కావడం వల్ల ఈ సినిమాకు ఇంతకుముందున్న హైప్ తగ్గిన మాట వాస్తవం. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. రిలీజ్ టైంకి ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుందనే టీం ఆశిస్తోంది. పవన్ ప్రమోషన్లలో పాల్గొనకపోయినా.. మిగతా టీం సభ్యులు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు బజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఏఎం రత్నం సినిమాలోని మేజర్ హైలైట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

ఈ సినిమాలో రూ.20 కోట్ల ఖర్చుతో తీసిన యాక్షన్ ఎపిసోడ్ పవన్ అభిమానులనే కాక, ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు. తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాక.. తన మార్కు చూపించేలా ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్లు రత్నం వెల్లడించారు. జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టులోకి వచ్చాక ఏదైనా స్పెషల్‌గా చేయాలని అనుకున్నాడని.. అందుకోసం బాగా ఆలోచించి భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని రత్నం తెలిపారు. ఆ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని.. దానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ప్రస్తుతం ఫారిన్లో జరుగుతుందని.. త్వరలోనే ఆ కంటెంట్‌ను సినిమాకు జోడిస్తామని రత్నం తెలిపారు. 

ఈ ఒక్క ఎపిసోడ్‌కే రూ.20 కోట్లు ఖర్చు పెట్టామని. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సీక్వెన్స్ ఉంటుందని రత్నం తెలిపారు. ఇక దర్శకుడిగా క్రిష్ స్థానంలోకి తన కొడుకు రావడం గురించి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా చిత్రీకరణ చాలా ఆలస్యం అవుతుండడం, మరోవైపు ‘ఘాటి’తో పాటు క్రిష్ చేతిలో వేరే ప్రాజెక్టులు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రత్నం తెలిపారు. జ్యోతికృష్ణ రావడంతో ఈ ప్రాజెక్టుకు మంచే జరిగిందని, మిగతా సన్నివేశాలను అతను అద్భుతంగా తీశాడని రత్నం కితాబిచ్చారు.

This post was last modified on June 3, 2025 5:07 pm

Share

Recent Posts

సీఎం రేవంత్ విభేదాలు… సాయంత్రానికి సర్దుబాటు

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…

4 hours ago

ప్యారడైజ్ టికెట్ రేట్లకు ఏ స్ట్రాటజీ మంచిది

కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…

4 hours ago

అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…

7 hours ago

ఎంఎస్ సుబ్బులక్ష్మి… వాళ్ళిద్దరికీ పెద్ద ఛాలెంజ్

రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

8 hours ago

మనోళ్లకు మండాడి అంతెందుకు నచ్చింది

నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…

9 hours ago

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

11 hours ago