తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఇంకో పది రోజుల్లోనే ఆ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. షూట్ చాలా ఆలస్యం కావడం వల్ల ఈ సినిమాకు ఇంతకుముందున్న హైప్ తగ్గిన మాట వాస్తవం. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. రిలీజ్ టైంకి ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుందనే టీం ఆశిస్తోంది. పవన్ ప్రమోషన్లలో పాల్గొనకపోయినా.. మిగతా టీం సభ్యులు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు బజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఏఎం రత్నం సినిమాలోని మేజర్ హైలైట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ సినిమాలో రూ.20 కోట్ల ఖర్చుతో తీసిన యాక్షన్ ఎపిసోడ్ పవన్ అభిమానులనే కాక, ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు. తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాక.. తన మార్కు చూపించేలా ఈ ఎపిసోడ్ను డిజైన్ చేసినట్లు రత్నం వెల్లడించారు. జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టులోకి వచ్చాక ఏదైనా స్పెషల్గా చేయాలని అనుకున్నాడని.. అందుకోసం బాగా ఆలోచించి భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని రత్నం తెలిపారు. ఆ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని.. దానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ప్రస్తుతం ఫారిన్లో జరుగుతుందని.. త్వరలోనే ఆ కంటెంట్ను సినిమాకు జోడిస్తామని రత్నం తెలిపారు.
ఈ ఒక్క ఎపిసోడ్కే రూ.20 కోట్లు ఖర్చు పెట్టామని. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సీక్వెన్స్ ఉంటుందని రత్నం తెలిపారు. ఇక దర్శకుడిగా క్రిష్ స్థానంలోకి తన కొడుకు రావడం గురించి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా చిత్రీకరణ చాలా ఆలస్యం అవుతుండడం, మరోవైపు ‘ఘాటి’తో పాటు క్రిష్ చేతిలో వేరే ప్రాజెక్టులు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రత్నం తెలిపారు. జ్యోతికృష్ణ రావడంతో ఈ ప్రాజెక్టుకు మంచే జరిగిందని, మిగతా సన్నివేశాలను అతను అద్భుతంగా తీశాడని రత్నం కితాబిచ్చారు.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…