తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందంటూ తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కమల్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు మండిపడుతున్నారు. కమల్ క్షమాపణలు చెప్పాలని కన్నడ భాషా పండితులతో పాటు చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదని కమల్ అన్నారు. ఈ కామెంట్లు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
ఈ క్రమంలోనే కమలహాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్ విడుదలను అడ్డుకుంటామని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలోనే కమలహాసన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు కమలహాసన్ కు లేదని కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక క్షమాపణ చెబితే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవని కమల్ కు హితవు పలికింది.
ప్రజాప్రతినిధిగా, నటుడిగా కమల్ అటువంటి ప్రకటన చేయకూడదని హైకోర్టు అభిప్రాయపడింది. ఏ ప్రాతిపదికన కమల్ హాసన్ ఆ ప్రకటన చేశారని ప్రశ్నించిన కోర్టు…కమల్ హాసన్ ఏమైనా చరిత్రకారుడా లేక భాషావేత్తా అని నిలదీసింది. కమల్ హాసన్ కామెంట్స్ వల్ల కన్నడ నాట అశాంతి ఏర్పడిందని, కమల్ హాసన్ అయినా, మరెవరైనా ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని తేల్చి చెప్పింది.
క్షమాపణ చెప్పే ఉద్దేశం లేని పక్షంలో కర్ణాటకలో ఆ సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారని ప్రశ్నించింది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో కమల్ క్షమాపణలు చెబుతారా లేదా? కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలవుతుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
ఈ లోపే కమల్ డైరెక్ట్ గా క్షమాపణలు లేకుండా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కర్ణాటక ప్రజలు తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, అన్ని భాషలు ఒక కుంటుం అని చెప్పడమే తన ప్రయత్నమని కమల్ అందులో చెప్పుకొచ్చారు. కన్నడ భాషపై తనకు ఎప్పుడూ ప్రేమ ఉంటుందని చెప్పారు. మరి దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on June 3, 2025 3:03 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…