ఒకపక్క కమల్ హాసన్ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ తన సినిమా విడుదలకు ఆటంకాలు లేకుండా చూడమని కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఇంకోవైపు దీని మీద నిషేధం విధించిన కర్ణాటక ఫిలిం ఛాంబర్ పెద్దలు మరోసారి సమావేశం జరిపి నిర్ణయం తీసుకోబోతున్నారు. సాంకేతికంగా చూస్తే థగ్ లైఫ్ ని బ్యాన్ చేయడం చట్ట సమ్మతం కాదు. ఒకవేళ న్యాయస్థానం కనక పోలీసుల పహారాలో రిలీజ్ చేయమని తీర్పు ఇస్తే దాన్ని ధిక్కరించే సాహసం ఎవరూ చేయలేరు. కాకపోతే థియేటర్లలో ఉద్రిక్త సంఘటనలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. నిరసనకారులు ఆ దిశగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కోర్టు కనక కమల్ హాసన్ ని క్షమాపణ చెప్పమని కోరితే కథ సుఖంతమవుతుంది. న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దానికి అవకాశం లేదు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వీడియో సాక్షిగా కమల్ చెప్పారు కాబట్టి ఆ స్టేట్ మెంట్ ని సమర్థిస్తూ ఆధారాలు ఉంటే చూపమని అడగొచ్చట. అవి చూపించని పక్షంలో సారీకి ఆదేశాలు జారీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నేనేం తప్పు చేయలేదు అంటున్న కమల్ హాసన్ మరి కన్నడ తమిళం నుంచి ఎలా పుట్టిందనే దానికి వివరణ ఇవ్వడం లేదు. వివాదం అంతకంతా ముదిరిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఎల్లుండి రిలీజ్ కాబోతున్న థగ్ లైఫ్ కు ఈ కాంట్రావర్సి తీవ్ర సమస్యగా మారింది. ఒక్క థియేటర్ లో రిలీజ్ చేసినా లోపలికి వెళ్లి ధ్వంసం చేస్తామని పలు సంఘాలు హెచ్చరించడంతో ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. పోలీసులని కాపలాగా పెట్టినా ప్రేక్షకులు రావడానికి భయపడతారని, కన్నడ మద్దతుదారులు ఎలాగూ సినిమాకి రారని అలాంటప్పుడు బలవంతంగా వేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంకో 48 గంటల సమయం మాత్రమే ఉండటంతో ఈ పరిణామాలు శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనను అభిమానించే కన్నడ ఫ్యాన్స్ సైత నిరసన గళం వినిపిస్తున్నారు.
This post was last modified on June 3, 2025 12:11 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…