సీనియర్ నటుడు ఇటీవల రెండుసార్లు స్టేజ్ మీద అదుపు తప్పి మాట్లాడడం చర్చనీయాంశం అయింది. ‘రాబిన్ హుడ్’ ఈవెంట్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి అన్న మాట మీద జరిగిన రభస చాలదని.. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి అన్న బూతు మాట తీవ్ర వివాదాస్పదమైంది.
తనపై విమర్శల దాడి నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ఆల్రెడీ స్పందించారు. తాను సరదాగా అన్న మాటను తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ అని తేల్చేశారు. ఇదే సమయంలో మాట పడ్డ ఆలీ సైతం ఈ వివాదంపై స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఆ మాట అన్నారని.. దీన్ని వివాదం చేయొద్దని ఆలీ కోరారు. రాజేంద్ర ప్రసాద్ కూతురిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న విషయాన్ని ఆలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“నిన్న కృష్ణారెడ్డి గారి పుట్టిన రోజు వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారి నోటి నుంచి అనుకోకుండా ఆ మాట దొర్లింది. సరదాగా. కానీ ఏంటంటే.. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్టు. ఆయన పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. ఇటీవల కాలంలో కూతురు పోయింది. అమ్మ లాంటి బిడ్డ. కావాలని అన్నది కాదు. దీన్ని ఎవరూ కూడా రభస చేయకండి. ఆయన పెద్దాయన. నమస్కారం” అని ఆలీ వ్యాఖ్యానించాడు.
రాజేంద్ర ప్రసాద్ మీద వయసు ప్రభావం, అలాగే కూతురి మరణం తాలూకు ఎఫెక్ట్ గురించి పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను సమర్థించకపోయినా.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని కోరుతున్నారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…