ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ రాకకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల జూన్ 15 టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అందులోనే సినిమా ఎప్పుడు విడుదవుతుందనేది పొందు పరిచారట. విశ్వసనీయ సమాచారం మేరకు టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ హారర్ డ్రామా డిసెంబర్ 12న థియేటర్లలో అడుగు పెట్టనుందని తెలిసింది. డిసెంబర్ 25 అడివి శేష్ డెకాయిట్ తీసుకున్న నేపథ్యంలో అదే నెల మొదటి వారం కన్నా మధ్యలో రావడమే బిజినెస్ కోణంలో బెస్టని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని యూనిట్ సభ్యుల మాట.
అఫీషియల్ స్టాంప్ లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం కానీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాలన్స్ ఉన్న పాటలు, షూటింగ్ ని అక్టోబర్ లోగా పూర్తి చేద్దామని ప్రభాస్ హామీ ఇవ్వడంతో దర్శకుడు మారుతీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీ అయ్యారట. టీజర్ కు డబ్బింగ్ అయిపోయింది. విజువల్స్ చూశాక అంచనాలు మారిపోవడం ఖాయమని, ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుందనే ధీమాతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉందట. ఈ మధ్యే లీకైన స్టిల్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ మాములుగా వెర్రెక్కిపోలేదు. ఇక అదే గెటప్ తో డైలాగులు చెబుతూన్న ప్రభాస్ ని చూస్తే ఏమైపోతారో ఊహించడం కష్టం.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన నెలలోనే ది రాజా సాబ్ రావడం మంచిదే. సంక్రాంతి కన్నా ముందే బాక్సాఫీస్ దగ్గర మొత్తం రాబట్టుకోవచ్చు. అనుకుంటాం కానీ కరెక్ట్ కంటెంట్ పడితే ఈ నెలలో వచ్చిన బ్లాక్ బస్టర్లు చాలానే ఉన్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి హిందీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 12 ఎంచుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే క్రిస్మస్ కి యష్ రాజ్ ఫిలింస్ అలియా భట్ స్పై మూవీ ‘ఆల్ఫా’ని ప్లాన్ చేస్తోందట. అదే నిజమైన పక్షంలో రాజా సాబ్ తీసుకున్న డెసిషన్ రైటే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లు నటించిన ఈ సినిమా సంజయ్ దత్ పాత్ర మరో ఆకర్షణ కానుంది.
This post was last modified on June 2, 2025 6:52 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…