కర్ణాటకలో ఏకంగా సినిమా బ్యాన్ అయ్యేదాకా వెళ్లిన కమల్ హాసన్ కన్నడ భాష కామెంట్ల వ్యవహారం ఎటుపోయి ఎటు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. థగ్ లైఫ్ తమ రాష్ట్రం థియేటర్లలో ప్రదర్శించే ప్రసక్తే లేదని ఫిలిం ఛాంబర్, రాజకీయ నాయకులందరూ ఏకతాటిపైకి రావడంతో జూన్ 5 కమల్ కన్నడ ఫ్యాన్స్ కి ఈ మూవీ చూసే ఛాన్స్ లేనట్టే. లోకనాయకుడు క్షమాపణ చెప్పే ఉద్దేశంలో లేకపోవడం వివాదాన్ని మరింత పెద్దదిగా మారుస్తోంది. కన్నడనాట నిరసన ప్రదర్శనలు, దిష్టి బొమ్మ దహనాలు, ధర్నా, ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమల్ కు మద్దతుగా ఎవరుంటారనే ప్రశ్న తలెత్తడం సహజం.
ప్రస్తుతం కోలీవుడ్ హీరో హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ విషయంగా మౌన వ్రతం పాటిస్తున్నారు. కమల్ కు సంఘీభావంగా నడిగర్ సంఘం నుంచి ఒక లేఖ విడుదలయ్యింది కానీ వ్యక్తిగతంగా ఏ ఆర్టిస్టు దీన్ని ఖండిస్తూ పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వడం కానీ మీడియా ముందుకు రావడం కానీ చేయలేదు. కనీసం ట్వీట్లు పెడుతున్న దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు కమల్ కి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ సినిమాల రిలీజ్ టైంకి శాండల్ వుడ్ లో ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకొచ్చిన తలనెప్పి లెమ్మని సైలెంట్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
నిజానికి కమల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన మాటలకు కట్టుబడి నో సారీ అంటున్నారు. తమిళం నుంచి కన్నడ ఎలా పుట్టిందో చెబితే వివాదం ఆగొచ్చు. కానీ ఆ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అనుకోలేం. ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇదంతా బయ్యర్లకు శిరోభారంగా మారింది. ఈ కాంట్రవర్సి వల్ల కనీసం పాతిక కోట్ల దాకా నష్టం వాటిలవచ్చని ఒక అంచనా. దానికీ కమల్ హాసన్ సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ఆయనకు ఫ్యాన్ అన్న పాపానికి శివరాజ్ కుమార్ కూడా ఈ ఇష్యూలో నలిగిపోతున్నారు. థగ్ లైఫ్ ఘటనకు నిరసనగా కన్నడ సినిమాలను తమిళనాడులో నియంత్రించే ఆలోచన కోలీవుడ్ లో జరుగుతోందట.
This post was last modified on June 1, 2025 2:57 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…