కర్ణాటకలో ఏకంగా సినిమా బ్యాన్ అయ్యేదాకా వెళ్లిన కమల్ హాసన్ కన్నడ భాష కామెంట్ల వ్యవహారం ఎటుపోయి ఎటు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. థగ్ లైఫ్ తమ రాష్ట్రం థియేటర్లలో ప్రదర్శించే ప్రసక్తే లేదని ఫిలిం ఛాంబర్, రాజకీయ నాయకులందరూ ఏకతాటిపైకి రావడంతో జూన్ 5 కమల్ కన్నడ ఫ్యాన్స్ కి ఈ మూవీ చూసే ఛాన్స్ లేనట్టే. లోకనాయకుడు క్షమాపణ చెప్పే ఉద్దేశంలో లేకపోవడం వివాదాన్ని మరింత పెద్దదిగా మారుస్తోంది. కన్నడనాట నిరసన ప్రదర్శనలు, దిష్టి బొమ్మ దహనాలు, ధర్నా, ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమల్ కు మద్దతుగా ఎవరుంటారనే ప్రశ్న తలెత్తడం సహజం.
ప్రస్తుతం కోలీవుడ్ హీరో హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ విషయంగా మౌన వ్రతం పాటిస్తున్నారు. కమల్ కు సంఘీభావంగా నడిగర్ సంఘం నుంచి ఒక లేఖ విడుదలయ్యింది కానీ వ్యక్తిగతంగా ఏ ఆర్టిస్టు దీన్ని ఖండిస్తూ పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వడం కానీ మీడియా ముందుకు రావడం కానీ చేయలేదు. కనీసం ట్వీట్లు పెడుతున్న దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు కమల్ కి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ సినిమాల రిలీజ్ టైంకి శాండల్ వుడ్ లో ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకొచ్చిన తలనెప్పి లెమ్మని సైలెంట్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
నిజానికి కమల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన మాటలకు కట్టుబడి నో సారీ అంటున్నారు. తమిళం నుంచి కన్నడ ఎలా పుట్టిందో చెబితే వివాదం ఆగొచ్చు. కానీ ఆ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అనుకోలేం. ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇదంతా బయ్యర్లకు శిరోభారంగా మారింది. ఈ కాంట్రవర్సి వల్ల కనీసం పాతిక కోట్ల దాకా నష్టం వాటిలవచ్చని ఒక అంచనా. దానికీ కమల్ హాసన్ సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ఆయనకు ఫ్యాన్ అన్న పాపానికి శివరాజ్ కుమార్ కూడా ఈ ఇష్యూలో నలిగిపోతున్నారు. థగ్ లైఫ్ ఘటనకు నిరసనగా కన్నడ సినిమాలను తమిళనాడులో నియంత్రించే ఆలోచన కోలీవుడ్ లో జరుగుతోందట.
This post was last modified on June 1, 2025 2:57 pm
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…