తమిళనాట ఇప్పుడు రజినీకాంత్ను మించిన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న హీరో విజయ్. అక్కడ బడా సినీ హీరోలు రాజకీయ నాయకులుగా మారడం ఆనవాయితీనే. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయాల్లో ఉండగా.. రజినీ కూడా ఆ దిశగా అడుగులేస్తున్నాడు. వీరి బాటలో విజయ్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఐతే అందుకు ఇంకా సమయం రాలేదని విజయ్ భావిస్తున్నాడు.
ఐతే విజయ్ కంటే ముందు అతడి తండ్రి చంద్రశేఖర్.. కొడుకు రాజకీయారంగేట్రంపై ముచ్చట పడిపోయాడు. విజయ్ అభిమానులతో కలిసి తాను మొదలుపెట్టిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే అభిమాన సంఘాన్ని ఇటీవలే ఆయన రాజకీయ పార్టీగా మార్చేశారు. ఇది తమిళనాట పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడంటూ అభిమానుల్లో కోలాహలం మొదలైంది.
ఐతే విజయ్ వెంటనే స్పందించి.. ఆ పార్టీకి తనకు సంబంధం లేదని, తన ఫొటోలు సహా ఏమీ ఆ పార్టీ కోసం వాడటానికి వీల్లేదని.. అభిమానులు ఆ పార్టీలో చేరొద్దని ప్రెస్ నోట్ ద్వారా స్పష్టం చేశాడు. అలాగే విజయ్ తల్లి, చంద్రశేఖర్ భార్య సైతం తాను ఆ పార్టీలో లేనని ప్రకటించింది.
దీంతో విజయ్కు, అతడి తండ్రికి విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది. దీనిపై ఇప్పుడు చంద్రశేఖర్ స్పందించాడు. 1993లో విజయ్ అభిమానుల కోసం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ను మొదలుపెట్టింది తానే అని, దాని సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆశయంతోనే రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించానని ఆయన చెప్పారు.
విజయ్కి కూడా మంచి చేయాలన్న తలంపుతోనే తాను ఈ పని చేశానన్నాడు. ఈ విషయాన్ని విజయ్ త్వరలో అర్థం చేసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశఆడు. తన ఫొటోను, ఇయక్కం పతాకాన్ని ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించడంపై ఆయన స్పందిస్తూ.. తనపై చర్యలు తీసుకుని జైలుకు పంపినా బాధపడనని చెప్పాడు.
వ్యవస్థాపకుడిగా ఉంటున్న తాను విజయ్ మక్కల్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చే హక్కు ఉందన్నాడు. తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలు రావడం, మాట్లాడకుండా ఉండటం సాధారణమైన విషయాలేనని.. విజయ్కి తెలియకుండా అనేక రహస్య సంఘటనలు జరుగుతున్నాయని, అతడి పేరిట వచ్చిన ప్రెస్ నోట్ కూడా విజయ్ విడుదల చేసింది కదాని చంద్రశేఖర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on November 8, 2020 2:57 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…