Movie News

పవన్ కమిట్మెంట్ : పగలు షూట్ రాత్రి డబ్బింగ్

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు పార్ట్ 1 విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే సమయముంది. అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరో దర్శనమవుతుందాని ఎదురు చూస్తుండగా సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పటిదాకా పవన్ డబ్బింగ్ చెప్పలేదనే కామెంట్స్ నేపథ్యంలో టీమ్ అఫీషియల్ గా దానికి సమాధానం చెప్పేసింది. ప్రస్తుతం ఓజి షూట్ లో బిజీగా ఉన్న పవన్ దాన్ని పగలు చేసుకుని రాత్రి పూట ఏకధాటిగా నాలుగు గంటల పాటు వీరమల్లుకి డబ్బింగ్ చెప్పేసి తన పని పూర్తి చేశాడు. ఇక సెన్సార్ ఫార్మాలిటీ ఒకటే బాకీ ఉంది.

దీంతో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బాధ్యత పూర్తయిపోయింది. గత రెండు మూడు నెలలుగా వీరమల్లు పూర్తి చేయడం కోసం డేట్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డ పవన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు గుమ్మడికాయ కొట్టేందుకు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టైం చాలా తక్కువగా ఉండటంతో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ కాళ్లకు చక్రాలు కట్టుకుని మెట్రో స్పీడ్ తో పనులు చేయడంలో బిజీగా ఉన్నారు. కంటెంట్ మీద నమ్మకంతో రత్నం ఓన్ రిలీజ్ కు వెళ్తున్నారనే వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా షేర్ ఆశిస్తున్నారు.

సో జనవరి తర్వాత ఒక పెద్ద హీరో సినిమా వస్తున్న నెల జూన్ ని హరిహర వీరమల్లు ఎంతమేరకు డామినేట్ చేస్తుందో చూడాలి. అదే రోజు పోటీ లేనప్పటికీ ఆపై వారం నుంచి వరసగా కుబేర, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. కాకపోతే పవన్ టాక్ కనక పాజిటివ్ తెచ్చుకుంటే కనీసం నెల రోజులు మంచి థియేటర్ రన్ దక్కుతుంది. థియేటర్ల బంద్ వివాదం, ఎగ్జిబిట్లర్ల పంచాయితీ, టాలీవుడ్ నిర్మాతల ప్రెస్ మీట్లు ఇవన్నీ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో హరిహర వీరమల్లుకి ఇంకెలాంటి డైవెర్షన్లు ఉండబోవడం లేదు. మరి అంచనాలకు తగ్గట్టు వీరమల్లు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

This post was last modified on May 29, 2025 4:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago