టాలీవుల్లో ప్రస్తుతం మాంచి ఊపుమీదున్న కమెడియన్ ఎవరంటే.. సత్య పేరే చెప్పాలి. ఒక ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉన్న సత్య.. సరైన పాత్ర పడితే ఎలా చెలరేగిపోతాడో చాలా సినిమాలు రుజువు చేశాయి. ‘మత్తు వదలరా-2’ తన కెరీర్కు పెద్ద మలుపు అని చెప్పాలి. ఆ సినిమా పెద్ద హిట్ కావడంలో అత్యంత కీలక పాత్ర సత్యదే. తన కామెడీనే సినిమాను డ్రైవ్ చేసింది. కానీ తర్వాత సత్యకు సరైన పాత్రలు పడట్లేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో వ్యక్తమైంది.
ఐతే ఇప్పుడు సత్య కామెడీ టైమింగ్ను పూర్తిగా వాడుకునే ఒక క్యారెక్టర్ అతడికి దక్కినట్లే కనిపిస్తోంది. అదే.. బెట్టింగ్ భోగి. ఐతే ఈ పాత్ర సినిమాలోనిది కాదు. సత్య తొలిసారిగా నటిస్తున్న ఓ వెబ్ సిరీస్లోనిది. అదే.. 3 రోజెస్2. ఆహా ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ నుంచి సత్య క్యారెక్టర్కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ తాలూకు దుష్పరిణామాల గురించి ఈ మధ్య ఎంత పెద్ద చర్చ జరిగిందో తెలిసిందే. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో బెట్టింగ్కు బానిసైన ఓ కుర్రాడి పాత్రను సత్య కోసం తీర్చిదిద్దారు.
ఐతే టాపిక్ సీరియస్ అయినా.. దాన్ని సత్య టైమింగ్కు తగ్గట్లు భలే ఫన్నీగా తీర్చిదిద్దారు. ఓ మంచి సందేశాన్ని ఒక కామెడీ క్యారెక్టర్ ద్వారా చెబితే జనాలకు బాగా ఎక్కుతుందనడంలో సందేహం లేదు. ట్రెండీ మీమ్స్ను వాడుకుంటూ ఈ పాత్రను చాలా ఫన్నీగా తీర్చిదిద్దినట్లున్నారు మేకర్స్. రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్లో సత్య ప్రతి పంచ్ పేలింది. తన పాత్ర హిలేరియస్గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చింది టీజర్. ‘3 రోజెస్’ ఫస్ట్ సీజన్ ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. కానీ రెండో సీజన్ను కేవలం సత్య కోసమే జనం చూసేలా ఉన్నారు. అంత ఇంట్రెస్టింగ్గా టీజర్ కట్ చేసింది టీం.
This post was last modified on May 27, 2025 9:49 pm
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…