జూన్ 6 విడుదల కాబోతున్న బాలీవుడ్ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 5 దర్శక నిర్మాతలు ఒక వెరైటీ ప్రయోగం చేశారు. రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి కొన్ని థియేటర్లలో ఒకటి, ఇతర స్క్రీన్లలో వేరొకటి ప్రదర్శించబోతున్నారు. ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఇవాళ ట్రైలర్ లాంచ్ లో చెప్పడం చూసి అందరూ షాక్ తిన్నారు. రెండు వెర్షన్లకు సెన్సార్ విడివిడిగా చేయించడం విశేషం. అయితే ఎక్కడ ఏ క్లైమాక్స్ ఉందో సినిమా చూస్తే కానీ తెలియదట. ఉదాహరణకు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఎండింగ్ ఒకలా ఉంటే దానికి దగ్గర్లో ఉండే పివిఆర్ పంజాగుట్టలో ఇంకోలా ఫినిషింగ్ ఉంటుందన్న మాట. రెండు షోలు చూస్తేనే తేడా తెలుస్తుంది.
ఇలా ఎందుకు చేశారంటే కిక్కు కోసమని రవితేజ స్టైల్ లో చెబుతున్నారు. నిజానికి ఇలా రెండు క్లైమాక్స్ లు తీయడం ఇదేం మొదటిసారి కాదు. ఆల్ టైం క్లాసిక్ షోలే చివరి ఘట్టాన్ని రెండు రకాలుగా తీశారు. ఒకదాంట్లో అంజాద్ ఖాన్ ని సంజీవ్ కుమార్ చంపే సీన్ ఉంటే మరొకటి అంజాద్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఉంటుంది. సెన్సార్ అభ్యంతరం మేరకు రెండోదాన్ని లాక్ చేశారు నిర్మాత. యూట్యూబ్ లో ఈ వ్యత్యాసం చూడొచ్చు. కృష్ణ, నాగార్జున కలయికలో వచ్చిన వారసుడులో ముందు కృష్ణ చనిపోయినట్టుగా చూపిస్తారు. ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తర్వాత హ్యాపీ ఎండింగ్ గా మార్చేశారు.
ఇలా పలు ఉదాహరణలున్నాయి కానీ హౌస్ ఫుల్ 5 మాత్రం వీటికి భిన్నంగా ప్లాన్ చేసింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశముఖ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, జాకీ శ్రోఫ్, నానా పాటేకర్, జానీ లివర్, నర్గిస్ ఫక్రే, సోనమ్ బాజ్వా, ఫర్దీన్ ఖాన్, డినో మోరియా ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు తరుణ్ మన్సుఖని దర్శకత్వం వహించారు. కథలో అసలు హంతకుడు ఎవరనే దాని మీద రెండు ట్విస్టులు పెట్టారట. వాటి నుంచి థ్రిల్ ఇవ్వడం కోసమే రెండు క్లైమాక్స్ లు పెట్టామని చెబుతున్న హౌస్ ఫుల్ బృందం చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…