ఒకప్పుడు సినిమాల సక్సెస్ సెలబ్రేషన్లు విడుదలైన 50 రోజులకో, 100 రోజులకో జరిగేవి. సినిమాలు వారాల తరబడి ఆడేవి కాబట్టి.. రన్ పూర్తయ్యాక విజయోత్సవాలు జరిపేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమాల రన్ వారం రెండు వారాలకు పరిమితం అవుతోంది. చాలా చిత్రాల పని వీకెండ్తోనే అయిపోతోంది. అందుకు తగ్గట్లే సక్సెస్ సెలబ్రేషన్లు కూడా చాలా త్వరగానే వచ్చేస్తున్నాయి. తొలి వీకెండ్లో, కుదిరితే తొలి రోజే విజయోత్సవ సంబరాలు జరిగిపోతున్నాయి. రెండు షోలైనా అవ్వకముందే సెలబ్రేట్ చేయడమూ చూస్తున్నాం.
ఐతే ఇప్పుడు విడుదలకు నాలుగు రోజుల ముందే విజయోత్సవ సంబరాలతో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. అతను హీరోగా తెరకెక్కిన ‘భైరవం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రసాద్ ల్యాబ్లో తన సన్నిహితులతో కలిసి ఈ సినిమా ప్రివ్యూ షో చూశాడు శ్రీనివాస్. ఆ వెంటనే అతను సక్సెస్ సెలబ్రేషన్లు మొదలుపెట్టేశాడు.
కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే కాక.. బయట పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి శ్రీనివాస్ అండ్ టీం చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సినిమా చూశాక పెద్ద హిట్ అని కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉండొచ్చు. కానీ రిలీజ్కు ముందే ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్లో ఇది కొత్త ట్రెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీని మీద సెటైర్లు కూడా పడుతున్నాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా, పైగా ఔట్ పుట్ బాగా వచ్చేసరికి శ్రీనివాస్ అండ్ కో ఎగ్జైట్ అయినట్లున్నారని.. దీన్ని మరీ నెగెటివ్గా చూడాల్సిన అవసరం లేదని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించిన ‘భైరవం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on May 27, 2025 6:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…