Movie News

ప‌వ‌న్ సినిమాలు ఆపే ద‌మ్ము ఎవ‌రికుంది? : దిల్‌రాజు

తెలుగు సినీ రంగ అగ్ర‌న‌టుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌ను ఆపే ద‌మ్ము ఎవ‌రికీ లేద‌ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండురోజుల కింద‌ట రాసిన లేఖ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూనే ఉంది. సినీ రంగానికి కృత‌జ్ఞ‌త లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఒక్కొక్క‌రుగా స్పందిస్తున్నారు. బ‌న్నీ వాసు, అల్లు అర‌వింద్, నిర్మాత నాగ‌వంశీ ఇప్ప‌టి వ‌రకురియాక్ట్ అయ్యారు.

తాజాగా దిల్ రాజు కూడా మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలను ఆపే ద‌మ్ము ఎవ‌రికుంద‌ని ప్ర‌శ్నించారు. అలా చేసే ద‌మ్ము ఎవ‌రికీ లేద‌న్నారు. ఎగ్జిబిట‌ర్ల‌కు కొన్ని స‌మ‌స్య‌లు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కొంద‌రు ఎగ్జిబిట‌ర్లు(పేర్లు చెప్ప‌లేదు) ఈ స‌మ‌స్య‌ను వివ‌రించార‌ని చెప్పారు. దీనిపై చ‌ర్చలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసిన‌ట్టు చెప్పారు.

ప్ర‌స్తుతం ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రి బ్యూట‌ర్ల ప‌ర్సంటేజీ స‌మ‌స్య రెండు రాష్ట్రాల్లోనూ ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని తాను అడ్డుకున్న‌ట్టు రాజు తెలిపారు. బంద్ అనేది కేవ‌లం ఆలోచ‌న మాత్ర‌మేన‌ని దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు. అయితే.. వీర‌మ‌ల్లు సినిమా విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం ఎక్కువైంద‌ని ఆరోపించారు. కానీ, పవన్‌కల్యాణ్‌ సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు.

వాస్త‌వానికి ఫిలిం చాంబ‌ర్‌లోనే స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, రెండు ప్ర‌భుత్వాల నుంచి త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని రాజు వివ‌రించారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచమంటే.. ఎలాంటి ప్ర‌శ్న‌లు కూడా అడ‌గ‌కుండానే పెంచుతున్నార‌ని చెప్పారు. కానీ, త‌మ‌లో త‌మ‌కు ఐక్య‌త లోపించిన కార‌ణంగానే ఇలా జ‌రుగుతోంద‌ని.. దీనిలో మీడియా పాత్ర కూడా ఉంద‌ని ఆరోపించారు. ఇక నుంచైనా ఇలాంటివి క‌ట్టిపెట్టాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on May 26, 2025 7:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

1 hour ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

2 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

5 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

6 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

6 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

7 hours ago