పెద్ద బడ్జెట్ తో హిట్ 3 ది థర్డ్ కేస్ నిర్మించిన నిర్మాత కం హీరో నాని దాన్ని ఉత్తరాదిలో కేవలం సింగల్ స్క్రీన్లకే పరిమితం చేయడం పట్ల తొలుత కొన్ని కామెంట్లు వచ్చాయి. తమ సముదాయాల్లో షోలు ఇవ్వాలంటే ఓటిటి గ్యాప్ కనీసం యాభై రోజులు ఉండాలనేది నార్త్ మల్టీప్లెక్సులు పెట్టుకున్న నిబంధన. దానికి ఒప్పుకుంటేనే పివిఆర్ ఐనాక్స్ లాంటి వాటిలో స్క్రీనింగ్ ఉంటుంది. కానీ నాని నో అన్నాడు. నెట్ ఫ్లిక్స్ లో 28 రోజుల స్ట్రీమింగ్ కి ఎస్ చెప్పేసి దానికి అనుగుణంగా ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. కట్ చేస్తే తెలుగులో సూపర్ హిట్టయిన హిట్ 3 హిందీలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
ఈ వారం మే 29న హిట్ 3 డిజిటల్ లో వచ్చేస్తోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నాని నిర్ణయం ఎంత సబబో అర్థమవుతుంది. ఒకవేళ హిందీ మల్టీప్లెక్సుల కోసం నాని కనక యాభై రోజుల అగ్రిమెంట్ చేసుకుని ఉంటే నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిన మొత్తంలో ఎక్కువ కోత పడేది. దానికి తోడు ఉత్తరాది థియేటర్ రెస్పాన్స్ పెద్దగా రాలేదు కాబట్టి త్వరగా రన్ పూర్తి చేయాల్సి వచ్చేది. దాని వల్ల నష్టపోయేది నాని తప్ప వేరొకరు కాదు. అందుకే నెల రోజుల విండో చాలనుకుని దానికి తగ్గట్టే సింగల్ స్క్రీన్లలో వేస్తే చాలనుకుని కట్టుబడ్డాడు. పైగా మొదటి వారంలోనే వచ్చిన హెచ్డి పైరసీ చాలా పెద్ద దెబ్బ కొట్టింది. బయటికి చెప్పలేదంతే.
ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గాలని దాన్ని ఎనిమిది వారాలకు పెంచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇకపై నిర్మాతల ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. అలా చేసినంత మాత్రాన జనాలు థియేటర్లకు పరిగెత్తుకొస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కోర్ట్ లాంటి చిన్న సినిమాను ఆదరించిన ప్రేక్షకులే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టిన డిజాస్టర్లను మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఏదేమైనా ఓటిటి విషయంలో మనమే అలవాటు చేసి మనమే దాన్ని మాన్పించాలనుకోవడం అంత సులభం కాదు. అందుకే నాని లాంటి ప్రొడ్యూసర్లు తీసుకునే నిర్ణయాలు సబబుగా అనిపిస్తున్నాయి.
This post was last modified on May 24, 2025 1:01 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…