తెలుగు మూలాలున్న కన్నడ అమ్మాయి శ్రీలీల ప్రస్తుతం ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తమిళంలో, హిందీలో, కన్నడలోనూ నటిస్తోంది శ్రీలీల.
హిందీలో ‘ఆషిఖి-3’ లాంటి క్రేజీ మూవీ చేస్తున్న శ్రీలీల.. తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరాశక్తి ఆమెకు తమిళంలో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తుండగా.. ఇప్పుడా చిత్రం పెద్ద చిక్కుల్లో పడింది. తెలుగమ్మాయి అయిన సుధ కొంగర ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత చేస్తున్న ఈ చిత్రమిది.
కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన ‘పరాశక్తి’ టీజర్ భలేగా అనిపించింది. శివకార్తికేయన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన శివకార్తికేయన్కు ఈ సినిమా నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్ల పారితోషకం ఇస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడీ చిత్రం సమస్యల్లో చిక్కుకుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న డాన్ పిక్చర్స్ అధినేతలు ఓ స్కామ్లో చిక్కుకున్నారు. ఈడీ అధికారులు వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్కామ్ చాలా పెద్దదనే తెలుస్తోంది. నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డట్లే కనిపిస్తున్నారు.
శివ కార్తికేయన్ మార్కెట్ స్థాయికి మించి ఇచ్చిన పారితోషకంలో బ్లాక్ మనీ చాలా ఉందని.. ఆ డబ్బుతో శివకు ఒక భారీ భవంతిని నిర్మిస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు నిర్మాతలు ఈడీ అధికారుల వలలో చిక్కుకోవడంతో శివ సైతం ఇబ్బందుల్లో పడ్డాడని అంటున్నారు. ఈ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉందని.. చిత్రీకరణ ముందుకు సాగడం కష్టమని కూడా చెబుతున్నారు. ఓ క్రేజీ ప్రాజెక్టుతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నానని శ్రీలీల ఎగ్జైట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉండడంతో ఆమెకు కోలీవుడ్లో పెద్ద బ్రేక్ పడ్డట్లే. తెలుగమ్మాయే అయిన దర్శకురాలు సుధకు కూడా ఇది ఇబ్బందే.
This post was last modified on May 23, 2025 4:50 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…