తెలుగు మూలాలున్న కన్నడ అమ్మాయి శ్రీలీల ప్రస్తుతం ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తమిళంలో, హిందీలో, కన్నడలోనూ నటిస్తోంది శ్రీలీల.
హిందీలో ‘ఆషిఖి-3’ లాంటి క్రేజీ మూవీ చేస్తున్న శ్రీలీల.. తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరాశక్తి ఆమెకు తమిళంలో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తుండగా.. ఇప్పుడా చిత్రం పెద్ద చిక్కుల్లో పడింది. తెలుగమ్మాయి అయిన సుధ కొంగర ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత చేస్తున్న ఈ చిత్రమిది.
కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన ‘పరాశక్తి’ టీజర్ భలేగా అనిపించింది. శివకార్తికేయన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన శివకార్తికేయన్కు ఈ సినిమా నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్ల పారితోషకం ఇస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడీ చిత్రం సమస్యల్లో చిక్కుకుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న డాన్ పిక్చర్స్ అధినేతలు ఓ స్కామ్లో చిక్కుకున్నారు. ఈడీ అధికారులు వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్కామ్ చాలా పెద్దదనే తెలుస్తోంది. నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డట్లే కనిపిస్తున్నారు.
శివ కార్తికేయన్ మార్కెట్ స్థాయికి మించి ఇచ్చిన పారితోషకంలో బ్లాక్ మనీ చాలా ఉందని.. ఆ డబ్బుతో శివకు ఒక భారీ భవంతిని నిర్మిస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు నిర్మాతలు ఈడీ అధికారుల వలలో చిక్కుకోవడంతో శివ సైతం ఇబ్బందుల్లో పడ్డాడని అంటున్నారు. ఈ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉందని.. చిత్రీకరణ ముందుకు సాగడం కష్టమని కూడా చెబుతున్నారు. ఓ క్రేజీ ప్రాజెక్టుతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నానని శ్రీలీల ఎగ్జైట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉండడంతో ఆమెకు కోలీవుడ్లో పెద్ద బ్రేక్ పడ్డట్లే. తెలుగమ్మాయే అయిన దర్శకురాలు సుధకు కూడా ఇది ఇబ్బందే.
This post was last modified on May 23, 2025 4:50 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…