అక్కినేని నాగార్జున కేవలం నటుడే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బేనర్ మీద ఆయన అనేక పెద్ద, చిన్న సినిమాలను నిర్మించారు. అలాగే అదే బేనర్ మీద ఎన్నో చిత్రాలను డిస్ట్రిబ్యూటర్ చేశారు కూడా. గత కొన్నేళ్లలో మారిన పరిస్థితుల దృష్ట్యా కొంచెం దూకుడు తగ్గించారు నాగ్. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఓ పెద్ద సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అది ఆయన వేరే భాషలో నటించిన సినిమా కావడం విశేషం.
‘నా సామి రంగ’ తర్వాత స్క్రీన్ మీద కనిపించని నాగ్.. రెండు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘కుబేర’ కాగా.. ఇంకోటి ‘కూలీ’. వీటిలో ‘కూలీ’ మీద ఉన్న అంచనాలే వేరు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందకు రాబోతోంది. అసలే సూపర్ స్టార్ సినిమా. పైగా లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఇంకా నాగ్తో పాటు ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేశాడు. దీంతో ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం గట్టి పోటీనే నెలకొంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేరే సంస్థలు కూడా పోటీలో ఉన్నప్పటికీ నాగవంశీ తెలుగు రైట్స్ కోసం ఏకంగా రూ.40 కోట్లకు పైగా రేటు పెట్టడానికి రెడీ అయ్యాడట. రజినీ గత చిత్రం ‘వేట్టయాన్’తో పోలిస్తే ఇది నాలుగు రెట్లకన్నా ఎక్కువ రేటు కావడం విశేషం. ఐతే ఇలా ఫ్యాన్సీ రేటు ఇస్తున్నప్పటికీ.. ‘కూలీ’ మేకర్స్ అక్కినేని నాగార్జున వైపే చూస్తున్నారట. ఆయన కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రేసులో ఉన్నాడట. రేటు కొంచెం అటు ఇటు అయినప్పటికీ నాగ్కు ప్రయారిటీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ ఫిక్స్ అయితే.. నాగ్ నటించిన సినిమాను ఆయనే రిలీజ్ చేస్తే హైప్ ఇంకా పెరగడం ఖాయం.
This post was last modified on May 22, 2025 10:31 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…