స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తప్పించారనే వార్త దావానలంలా పాకిపోవడం చూస్తూనే ఉన్నాం. తన డిమాండ్లను తట్టుకోలేక సందీప్ ఆమెను వద్దనుకుని కాంట్రాక్టు క్యాన్సిల్ చేశారనే టాక్ ముంబై మీడియాని ఊపేసింది. ఎనిమిది నెలల చిన్నారికి తల్లయినందు వల్లే ప్రత్యేక వెసులుబాటు అడిగిందని, కావాలనే తన గురించి చెడు ప్రచారం చేస్తున్నారనే తరహాలో కొందరు డిఫెన్స్ చేస్తున్నారు కానీ అంత ఇబ్బంది ఉన్నప్పుడు భారీ చిత్రాలు ఒప్పుకోవడం ఎందుకనే లాజిక్ కి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. బిడ్డను చూసుకోవడం కన్నా సినిమాలు ముఖ్యం కాదుగా
దీని సంగతలా ఉంచితే ప్రభాస్ మూవీ మిస్సయినా అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకునేని తీసుకున్నారనే వార్త అభిమానులకు కొత్త కిక్ ఇస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో మెయిన్ హీరోయిన్ గా తను దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనట. అయిదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ దీపికకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. ఏడు వందల కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్న ఈ విజువల్ గ్రాండియర్ పనుల కోసమే అట్లీ ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా షెడ్యూల్స్ వేస్తున్నారని తెలిసింది.
కల్కి 2898 ఏడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకునేకు కల్కి 2లో కూడా భాగం ఉంటుంది. దానికన్నా ముందు అల్లు అర్జున్ 22 రిలీజవుతుంది కాబట్టి రేంజ్ మాములుగా పెరగదు. ఇప్పటిదాకా బన్నీ మూవీకి సంబంధించి కాన్సెప్ట్ వీడియో తప్ప ఇంకెలాంటి ప్రమోషన్ కంటెంట్, క్యాస్టింగ్ అనౌన్స్ మెంట్లు రాలేదు. ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం అప్డేట్ ఇవ్వడానికి అట్లీ రెడీ అవుతున్నాడట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మల్టీ లాంగ్వేజ్ మూవీలో విఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతోంది. అందుకే షూటింగ్ అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. .
This post was last modified on May 22, 2025 9:17 pm
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు గుప్పించారు. రాష్ట్రంలో ఫ్యూచర్ లేని పార్టీకి…
చిన్న, పెద్ద అని తేడా లేకుండా దురంధర్, దురంధర్-2 చిత్రాల్లో నటించిన ప్రతి ఆర్టిస్టూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ…
గత ఏడాది ‘దండోరా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు…
పై ఫొటో ఎంత దారుణంగా ఉందో చూశారుగా!. రోడ్డు ప్రమాదాలకే ఇది పరాకాష్ట అని అధికారులు తెలిపారు. తమ ప్రమేయం…
ఎంతలా ప్రచారం చేసినా.. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ఎంతలా ప్రయత్నించినా.. నిత్యం కొన్ని వేల మంది మోసపోతున్న పరిస్థితి.…
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ.. వడివడిగా పరుగులు పెడుతోంది. ప్రజలను మచ్చిక చేసుకునే…