గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాకపోయినా.. గత మూడేళ్లలో మాత్రం అది విస్తృత స్థాయికి చేరుకుంది. కొత్త చిత్రాల స్థాయిలో భారీగా థియేటర్లు, షోలు కేటాయించడం.. అర్లీ మార్నింగ్ షోలు వేయడం.. అభిమానుల సంబరాలు పతాక స్థాయికి చేరడం.. వీటిలో కూడా ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్ల రికార్డుల గురించి చర్చ జరగడం.. ఇలా చాలానే చూశాం.
ఎన్నోసార్లు చూసిన సినిమాలను మళ్లీ ఇలా థియేటర్లలో సెలబ్రేట్ చేయడం తెలుగు ప్రేక్షకులకే చెల్లిందంటూ ఇతర భాషల వాళ్లు సైతం కొనియాడారు. దీని మీద కొంత విమర్శలు కూడా తప్పలేదు. ఐతే ఇప్పటిదాకా ఆయా హీరోల సినిమాలకు వారి అభిమానులు పట్టం కట్టడం బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఈ తేడాలు పక్కన పెట్టి అందరూ కలిసి సెలబ్రేట్ చేయాల్సిన రీ రిలీజ్ ఒకటి రెడీ అయింది. అదే.. మాయాబజార్.
ఎన్ని ఏళ్లు గడిచినా.. తరాలు మారినా.. ఇది మా సినిమా అని తెలుగు వారు గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో ‘మాయాబజార్’ ముందు వరుసలో ఉంటుంది. రైటింగ్.. టేకింగ్.. యాక్టింగ్.. ఇలా అనేక విషయాల్లో ఇప్పటికీ ఈ చిత్రం నుంచి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉన్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల కిందట వచ్చిన సినిమా అయినా.. ఇప్పుడు చూసినా తాజాగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించే మేలిమి చిత్రమది.
ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల చివరి వారంలో ‘మాయాబజార్’ను రీ రిలీజ్ చేస్తున్నారు. కొన్నేళ్ల కిందటే ఈ చిత్రాన్ని ఎంతో శ్రమించి మొత్తం కలర్లోకి మార్చారు. రీ రిలీజ్ ట్రెండ్ ఏమీ లేని టైంలో ఆ సినిమాను పరిమిత స్క్రీన్లలో రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని గురించి కొందరు ప్రముఖులు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు పట్టం కట్టి మన సినిమా వైభవాన్ని కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…