త్రివిక్రమ్తో త్వరలోనే సినిమా వుంటుందంటూ ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మహేష్ ప్రకటించాడు. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ ప్రకటించగా, మహేష్ ‘సర్కారు వారి పాట’ కూడా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా వున్న టైమ్లో తననుంచి ఆ ప్రకటన రావడం ఆశ్చర్యపరచింది. అయితే ఆ టైమ్లో నిజంగానే మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా వెంటనే సినిమా మొదలు పెట్టడానికి చాలా గట్టిగా కృషి చేసారట.
అయితే ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందట. అయితే త్రివిక్రమ్తో సినిమా చేయడం ఖాయమయినా కానీ ఎప్పుడు వుంటుందనే దానిపై మహేష్కి క్లారిటీ లేదు. ఎందుకంటే సర్కారు వారి పాట పూర్తయ్యేనాటికి త్రివిక్రమ్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీగా వుంటాడు. అతను వచ్చే వరకు మహేష్ ఎదురు చూడలేడు కనుక ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఇద్దరూ ఒకే టైమ్లో తీరికగా వుండాలి.
అందుకే త్రివిక్రమ్ పుట్టినరోజుకి తమ సినిమా ఊసేమీ లేకుండా కేవలం బర్త్ డే విషెస్ మాత్రం చెప్పి వదిలేసాడు మహేష్. అయితే ఈ కాంబినేషన్ త్వరలోనే తెరపైకి వస్తుందనే ఆశ పెట్టుకున్న అభిమానులు మాత్రం ఈ పరిణామంతో కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
This post was last modified on November 7, 2020 3:41 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…