త్రివిక్రమ్తో త్వరలోనే సినిమా వుంటుందంటూ ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మహేష్ ప్రకటించాడు. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ ప్రకటించగా, మహేష్ ‘సర్కారు వారి పాట’ కూడా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా వున్న టైమ్లో తననుంచి ఆ ప్రకటన రావడం ఆశ్చర్యపరచింది. అయితే ఆ టైమ్లో నిజంగానే మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా వెంటనే సినిమా మొదలు పెట్టడానికి చాలా గట్టిగా కృషి చేసారట.
అయితే ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందట. అయితే త్రివిక్రమ్తో సినిమా చేయడం ఖాయమయినా కానీ ఎప్పుడు వుంటుందనే దానిపై మహేష్కి క్లారిటీ లేదు. ఎందుకంటే సర్కారు వారి పాట పూర్తయ్యేనాటికి త్రివిక్రమ్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీగా వుంటాడు. అతను వచ్చే వరకు మహేష్ ఎదురు చూడలేడు కనుక ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఇద్దరూ ఒకే టైమ్లో తీరికగా వుండాలి.
అందుకే త్రివిక్రమ్ పుట్టినరోజుకి తమ సినిమా ఊసేమీ లేకుండా కేవలం బర్త్ డే విషెస్ మాత్రం చెప్పి వదిలేసాడు మహేష్. అయితే ఈ కాంబినేషన్ త్వరలోనే తెరపైకి వస్తుందనే ఆశ పెట్టుకున్న అభిమానులు మాత్రం ఈ పరిణామంతో కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
ఢిల్లీలోని మాళవియా నగర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్లో ఉదయం చెలరేగిన మంటలు…
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…