త్రివిక్రమ్తో త్వరలోనే సినిమా వుంటుందంటూ ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మహేష్ ప్రకటించాడు. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ ప్రకటించగా, మహేష్ ‘సర్కారు వారి పాట’ కూడా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా వున్న టైమ్లో తననుంచి ఆ ప్రకటన రావడం ఆశ్చర్యపరచింది. అయితే ఆ టైమ్లో నిజంగానే మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా వెంటనే సినిమా మొదలు పెట్టడానికి చాలా గట్టిగా కృషి చేసారట.
అయితే ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందట. అయితే త్రివిక్రమ్తో సినిమా చేయడం ఖాయమయినా కానీ ఎప్పుడు వుంటుందనే దానిపై మహేష్కి క్లారిటీ లేదు. ఎందుకంటే సర్కారు వారి పాట పూర్తయ్యేనాటికి త్రివిక్రమ్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీగా వుంటాడు. అతను వచ్చే వరకు మహేష్ ఎదురు చూడలేడు కనుక ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఇద్దరూ ఒకే టైమ్లో తీరికగా వుండాలి.
అందుకే త్రివిక్రమ్ పుట్టినరోజుకి తమ సినిమా ఊసేమీ లేకుండా కేవలం బర్త్ డే విషెస్ మాత్రం చెప్పి వదిలేసాడు మహేష్. అయితే ఈ కాంబినేషన్ త్వరలోనే తెరపైకి వస్తుందనే ఆశ పెట్టుకున్న అభిమానులు మాత్రం ఈ పరిణామంతో కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
This post was last modified on November 7, 2020 3:41 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…