అక్కినేని వారి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి అడుగు పెట్టిన నటుడు.. సుమంత్. తొలి చిత్రం ‘ప్రేమకథ’తోనే నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో ఒడుదొడుకులు తప్పలేదు. ఐతే ‘సత్యం’ లాంటి మంచి సినిమాతో గాడిన పడ్డట్లే కనిపించాడు. కానీ తర్వాత మళ్లీ కథ మామూలే. తప్పటడుగులతో కెరీర్ గాడి తప్పింది. ఓ మంచి సినిమా చేయడం.. తర్వాత వరుసగా పేలవమైన సినిమాలు అందించడం.. ఇదే వరస. గోదావరి, మళ్ళీ రావా లాంటి గొప్ప సినిమాల తర్వాత కూడా ఇదే జరిగింది.
‘మళ్ళీ రావా’ తర్వాత సుమంత్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటీ ఆకట్టుకోలేదు. ఇక అందరూ సుమంత్ను మరిచిపోతున్న దశలో ఇప్పుడు ‘అనగనగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. ఈటీవీ విన్ ద్వారా నేరుగా డిజిటల్గా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. చూసిన వాళ్లందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లల చదువులు.. వారి మీద సొసైటీ పెట్టే ఒత్తిడి.. ఫ్రీ లెర్నింగ్.. తండ్రీ కొడుకుల బంధం.. ఇలా పలు అంశాలను చర్చిస్తూ సాగిన ఈ సినిమా ప్రేక్షకులను కదిలించేస్తోంది. సొసైటీకి చాలా అవసరమైన సినిమా అంంటూ దీన్ని కొనియాడుతున్నారు. నెమ్మదిగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది.
ఈ సినిమాలో సుమంత్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మెచ్యూర్డ్ రోల్స్ను అతను బాగా పోషించగలడని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ‘అనగనగా’ ఇందుకు మరో ఉదాహరణ. సుమంత్ను అందరూ మరిచిపోతున్న దశలో తన సత్తా ఏంటో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా చూసిన చాలామంది అక్కినేనిని గుర్తు చేసుకుంటున్నారు. సుమంత్ తాతను గుర్తు చేశాడంటున్నారు. సుమంత్ ఇలాంటి పాత్రలు చేయకుండా పనికిరాని కథలు, పాత్రలను ఎందుకు ఎంచుకుంటున్నాడని ప్రశ్నిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని ఇకముందైనా తనకు సూటయ్యే ఇలాంటి మంచి పాత్రలు, కథలను ఎంచుకుని కెరీర్ను చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నారు.
This post was last modified on May 21, 2025 5:37 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…