జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ వార్ 2 టీజర్ ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యింది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వదలకుండా పబ్లిసిటి విషయంలో గుంభనంగా ఉన్న యష్ రాజ్ ఫిలింస్ ఈ రోజు నుంచి ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. అయాన్ ముఖర్జి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ప్రీతమ్ సంగీతం సమకూరుస్తున్న వార్ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. కూలీతో పాటు ఆగస్ట్ 14 విడుదల కానుంది.
కథేంటో మొత్తం చెప్పలేదు కానీ క్లూస్ అయితే ఇచ్చారు. ఇండియాలోనే బెస్ట్ రా ఏజెంట్ గా పేరు పొందిన కబీర్ (హృతిక్ రోషన్) ని సవాల్ చేస్తూ ఒకడొస్తాడు (జూనియర్ ఎన్టీఆర్), ఇకపై నీకా పేరు లేకుండా చేస్తానని ఛాలెంజ్ విసిరి ప్రతిచోటా సై అంటే సై అంటూ సవాల్ విసురుతాడు. శత్రువును తక్కువంచనా వేసిన కబీర్ కు తానెంత పొరపాటు చేశాడో అర్థమవుతుంది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంతకీ కబీర్ ని కవ్వించిన మరో ఏజెంట్, అతనికి ఎందుకా ఉద్దేశం కలిగింది, దేశం కోసం యుద్ధంలో చివరికి ఎవరిది పై చేయి అయ్యిందనేది తెరమీద చూడాలి.
ఎప్పటిలాగే యష్ రాజ్ విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఫైట్స్, ఛేజులు డిజైన్ చేసిన వైనం కనిపించింది. తారక్ ఇంట్రో, ట్రైన్ ఫ్లైట్ మీద పరస్పరం తలపడే ఎపిసోడ్, కత్తులతో దూసుకునే సన్నివేశం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. అయాన్ ముఖర్జీ మేకింగ్ లో చాలా క్వాలిటీ కనిపిస్తోంది. టీజర్ లో బిల్డప్ హృతిక్ రోషన్ కే ఎక్కువగా పెట్టడం గమనార్హం. ఇదింకా టీజరే కాబట్టి కంటెంట్ గురించి అప్పుడే ఒక నిర్ధారణకు రాలేం కాబట్టి ట్రైలర్ దాకా వేచి చూడాలి. మొత్తానికి అభిమానులు అంచనాలకు మించి వార్ 2లో పెద్ద యుద్ధాన్నే చూడబోతున్నామనే నమ్మకమైతే ఇచ్చారు.
This post was last modified on May 20, 2025 11:20 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…