Movie News

పవన్‍ సినిమాకి ప్లస్సే అయింది

వకీల్‍ సాబ్‍తో పాటు క్రిష్‍ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్‍ కళ్యాణ్‍ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్‍ కూడా చేసాడు. లాక్‍డౌన్‍ టైమ్‍లో పవన్‍ మళ్లీ సెట్స్కి రావడం ఆలస్యమవుతుందని తెలుసుకుని క్రిష్‍ వేరే చిన్న సినిమా చేసేసాడు. వకీల్‍ సాబ్‍ పూర్తి కాగానే క్రిష్‍ చిత్రం సెట్స్కి పవన్‍ వెళ్లాల్సి వుంది. కానీ మధ్యలో పవన్‍ ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్‍ చేయాలని డిసైడ్‍ అయ్యాడు.

ఈ చిత్రానికి పవన్‍ కేవలం నలభై రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. అందుకని మిగతా సినిమాలు వెనక్కి నెట్టి క్రిష్‍ని మరింత వెయిటింగ్‍లో పెట్టేసాడు పవర్‍స్టార్‍. అయితే ఈ గ్యాప్‍ని క్రిష్‍ ఈ చిత్రానికి ప్లస్‍ అయ్యేలా చూసుకుంటున్నాడు. పవన్‍తో సినిమా చాలా సడన్‍గా సెట్‍ అవడంతో క్రిష్‍కి ప్రీ ప్రొడక్షన్‍కి కానీ, స్క్రిప్ట్ బెటర్‍మెంట్‍కి కానీ ఎక్కువ సమయం దొరకలేదు. హడావుడిగా సెట్స్ మీదకు వెళ్లిపోయాడు.

ఇప్పుడు గ్యాప్‍ రావడంతో క్రిష్‍ మరో చిత్రమేదీ ప్లాన్‍ చేయకుండా పవన్‍ సినిమా కథకే మెరుగులు దిద్దుతున్నాడు. పవన్‍ మళ్లీ అందుబాటులోకి వచ్చేసరికి అయిదారు నెలలలో షూటింగ్‍ పూర్తి చేసేలా క్రిష్‍ పకడ్బందీగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఈలోగా పవన్‍కి ఇంకేదైనా రీమేక్‍పైకి మనసు మళ్లకపోతే అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍ తర్వాత క్రిష్‍ సినిమానే రిలీజ్‍ అవుతుంది.

Satya

Recent Posts

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

2 minutes ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

51 minutes ago

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

1 hour ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

1 hour ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

3 hours ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

3 hours ago