వకీల్ సాబ్తో పాటు క్రిష్ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్ కూడా చేసాడు. లాక్డౌన్ టైమ్లో పవన్ మళ్లీ సెట్స్కి రావడం ఆలస్యమవుతుందని తెలుసుకుని క్రిష్ వేరే చిన్న సినిమా చేసేసాడు. వకీల్ సాబ్ పూర్తి కాగానే క్రిష్ చిత్రం సెట్స్కి పవన్ వెళ్లాల్సి వుంది. కానీ మధ్యలో పవన్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఈ చిత్రానికి పవన్ కేవలం నలభై రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. అందుకని మిగతా సినిమాలు వెనక్కి నెట్టి క్రిష్ని మరింత వెయిటింగ్లో పెట్టేసాడు పవర్స్టార్. అయితే ఈ గ్యాప్ని క్రిష్ ఈ చిత్రానికి ప్లస్ అయ్యేలా చూసుకుంటున్నాడు. పవన్తో సినిమా చాలా సడన్గా సెట్ అవడంతో క్రిష్కి ప్రీ ప్రొడక్షన్కి కానీ, స్క్రిప్ట్ బెటర్మెంట్కి కానీ ఎక్కువ సమయం దొరకలేదు. హడావుడిగా సెట్స్ మీదకు వెళ్లిపోయాడు.
ఇప్పుడు గ్యాప్ రావడంతో క్రిష్ మరో చిత్రమేదీ ప్లాన్ చేయకుండా పవన్ సినిమా కథకే మెరుగులు దిద్దుతున్నాడు. పవన్ మళ్లీ అందుబాటులోకి వచ్చేసరికి అయిదారు నెలలలో షూటింగ్ పూర్తి చేసేలా క్రిష్ పకడ్బందీగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఈలోగా పవన్కి ఇంకేదైనా రీమేక్పైకి మనసు మళ్లకపోతే అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ తర్వాత క్రిష్ సినిమానే రిలీజ్ అవుతుంది.
This post was last modified on November 7, 2020 3:39 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…