Movie News

పవన్‍ సినిమాకి ప్లస్సే అయింది

వకీల్‍ సాబ్‍తో పాటు క్రిష్‍ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్‍ కళ్యాణ్‍ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్‍ కూడా చేసాడు. లాక్‍డౌన్‍ టైమ్‍లో పవన్‍ మళ్లీ సెట్స్కి రావడం ఆలస్యమవుతుందని తెలుసుకుని క్రిష్‍ వేరే చిన్న సినిమా చేసేసాడు. వకీల్‍ సాబ్‍ పూర్తి కాగానే క్రిష్‍ చిత్రం సెట్స్కి పవన్‍ వెళ్లాల్సి వుంది. కానీ మధ్యలో పవన్‍ ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్‍ చేయాలని డిసైడ్‍ అయ్యాడు.

ఈ చిత్రానికి పవన్‍ కేవలం నలభై రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. అందుకని మిగతా సినిమాలు వెనక్కి నెట్టి క్రిష్‍ని మరింత వెయిటింగ్‍లో పెట్టేసాడు పవర్‍స్టార్‍. అయితే ఈ గ్యాప్‍ని క్రిష్‍ ఈ చిత్రానికి ప్లస్‍ అయ్యేలా చూసుకుంటున్నాడు. పవన్‍తో సినిమా చాలా సడన్‍గా సెట్‍ అవడంతో క్రిష్‍కి ప్రీ ప్రొడక్షన్‍కి కానీ, స్క్రిప్ట్ బెటర్‍మెంట్‍కి కానీ ఎక్కువ సమయం దొరకలేదు. హడావుడిగా సెట్స్ మీదకు వెళ్లిపోయాడు.

ఇప్పుడు గ్యాప్‍ రావడంతో క్రిష్‍ మరో చిత్రమేదీ ప్లాన్‍ చేయకుండా పవన్‍ సినిమా కథకే మెరుగులు దిద్దుతున్నాడు. పవన్‍ మళ్లీ అందుబాటులోకి వచ్చేసరికి అయిదారు నెలలలో షూటింగ్‍ పూర్తి చేసేలా క్రిష్‍ పకడ్బందీగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఈలోగా పవన్‍కి ఇంకేదైనా రీమేక్‍పైకి మనసు మళ్లకపోతే అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍ తర్వాత క్రిష్‍ సినిమానే రిలీజ్‍ అవుతుంది.

This post was last modified on November 7, 2020 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

10 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

18 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago