Movie News

పవన్‍ సినిమాకి ప్లస్సే అయింది

వకీల్‍ సాబ్‍తో పాటు క్రిష్‍ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్‍ కళ్యాణ్‍ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్‍ కూడా చేసాడు. లాక్‍డౌన్‍ టైమ్‍లో పవన్‍ మళ్లీ సెట్స్కి రావడం ఆలస్యమవుతుందని తెలుసుకుని క్రిష్‍ వేరే చిన్న సినిమా చేసేసాడు. వకీల్‍ సాబ్‍ పూర్తి కాగానే క్రిష్‍ చిత్రం సెట్స్కి పవన్‍ వెళ్లాల్సి వుంది. కానీ మధ్యలో పవన్‍ ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్‍ చేయాలని డిసైడ్‍ అయ్యాడు.

ఈ చిత్రానికి పవన్‍ కేవలం నలభై రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. అందుకని మిగతా సినిమాలు వెనక్కి నెట్టి క్రిష్‍ని మరింత వెయిటింగ్‍లో పెట్టేసాడు పవర్‍స్టార్‍. అయితే ఈ గ్యాప్‍ని క్రిష్‍ ఈ చిత్రానికి ప్లస్‍ అయ్యేలా చూసుకుంటున్నాడు. పవన్‍తో సినిమా చాలా సడన్‍గా సెట్‍ అవడంతో క్రిష్‍కి ప్రీ ప్రొడక్షన్‍కి కానీ, స్క్రిప్ట్ బెటర్‍మెంట్‍కి కానీ ఎక్కువ సమయం దొరకలేదు. హడావుడిగా సెట్స్ మీదకు వెళ్లిపోయాడు.

ఇప్పుడు గ్యాప్‍ రావడంతో క్రిష్‍ మరో చిత్రమేదీ ప్లాన్‍ చేయకుండా పవన్‍ సినిమా కథకే మెరుగులు దిద్దుతున్నాడు. పవన్‍ మళ్లీ అందుబాటులోకి వచ్చేసరికి అయిదారు నెలలలో షూటింగ్‍ పూర్తి చేసేలా క్రిష్‍ పకడ్బందీగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఈలోగా పవన్‍కి ఇంకేదైనా రీమేక్‍పైకి మనసు మళ్లకపోతే అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍ తర్వాత క్రిష్‍ సినిమానే రిలీజ్‍ అవుతుంది.

This post was last modified on November 7, 2020 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 minutes ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

28 minutes ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

5 hours ago