నిన్న విడుదలైన ధగ్ లైఫ్ ట్రైలర్ లో హీరోయిన్లు అభిరామి, త్రిషలతో కమల్ హాసన్ చేసిన రొమాన్స్ మీద సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరుగుతోంది. ఏడు పదుల వయసులో లోక నాయకుడి చిలిపితనం పోలేదని, లేట్ ఏజ్ లోనూ ఆయన ముద్దులు పెడుతుంటే చూడముచ్చటగా ఉందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇంకోవైపు ఇలాంటి కిస్సు సన్నివేశాలు కమల్ కు అవసరమా, అవి లేకుండా సినిమా తీయలేరా అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మణిరత్నం – కమల్ కాంబోలో వచ్చిన నాయకుడులో ఎలాంటి ముద్దులు, శృంగార సన్నివేశాలు ఉండవు. కానీ ధగ్ లైఫ్ లో బోలెడు పెట్టినట్టే కనిపిస్తోంది.
ఇప్పుడీ డిబేట్ లో కొత్త కోణం బయటికి తీస్తున్నారు టాలీవుడ్ అభిమానులు. ఆ మధ్య డాకు మహారాజ్ లో ఊర్వశి రౌతేలాతో బాలయ్య వేసిన స్టెప్పుని ట్రోల్ చేసినవాళ్లు, భోళా శంకర్ లో చిరంజీవి యాంకర్ శ్రీముఖితో చేసిన కామెడీ గురించి ఎగతాళి చేసిన వాళ్ళకు ఇప్పుడు కమల్ రొమాన్స్ మాత్రం చూడముచ్చటగా ఉందా అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. రవితేజతో శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లాంటి యంగ్ బ్యూటీస్ జత కట్టినప్పుడు కూడా ఇలాంటి కామెంట్లు బోలెడొచ్చాయి. కానీ ధగ్ లైఫ్ లో కమల్ చేసింది కళాత్మక సృష్టి అనే రేంజ్ లో బిల్డప్ ఇవ్వడాన్ని సోషల్ మీడియా తెలుగు యువత అంగీకరించలేకపోతోంది.
కమల్ ఇప్పుడే కాదు గతంలో ఎన్నో సినిమాల్లో ఆధర చుంబనాలతో వార్తల్లో నిలవడం మాములు విషయం. ద్రోహిలో గౌతమి, హే రామ్ లో రాణి ముఖర్జీ, ఇప్పుడు ధగ్ లైఫ్ లో నటించిన అభిరామితోనే గతంలో పోతురాజులో చూపించిన కెమిస్ట్రీ ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది. ఇప్పుడూ దాన్నే ఫాలో అవుతున్నారు కాబోలు. కథ ప్రకారం డిమాండ్ మేరకే అలా చేశామని హీరో దర్శకుడు సమర్ధించుకోవచ్చు గాక. అయినా గ్యాంగ్ స్టర్ డ్రామాలను అవి లేకుండా తీయొచ్చని సత్య, కంపెనీ లాంటి వాటిలో చూశాంగా. మరి ధగ్ లైఫ్ లో ట్రైలర్ లో చూపించిన డోసే ఉంటుందా లేక ఇంకా ఎక్కువా అనేది జూన్ 5 చూడాలి.
This post was last modified on May 18, 2025 2:56 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…