భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో ముందు కన్ఫ్యూజన్ అనుకున్నది కాస్తా వివాదం అయ్యేలా ఉంది. రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో రాజమౌళి, కార్తికేయతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు మేడ్ ఇన్ ఇండియా సిరీస్ లో భాగంగా దీన్ని తీయాలనే ప్లాన్ లో ఉన్నట్టు వార్త బయటికి వచ్చింది. అయితే అమీర్ ఖాన్ సైతం ఇదే ప్రాజెక్టు కోసం దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో చేతులు కలిపినట్టుగా ముంబై మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ ఎంట్రీ ఇచ్చాడు.
తమను మూడు సంవత్సరాల నుంచి అమీర్ ఖాన్ బృందం ఫాలోఅప్ చేస్తూ సమాచారం సేకరిస్తున్నారని, వాళ్ళ పరిశోధన నచ్చిందని, హిరానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చర్చకు దారి తీస్తోంది. రాజమౌళి తరఫున ఎవరూ తమను కలవలేదని చెబుతున్న చంద్రశేఖర్ ఎవరిదైనా బయోపిక్ తీసే ముందు సదరు కుటుంబ సభ్యులను కలిసి అనుమతి తీసుకోవాలని అర్థం వచ్చేలా చెప్పడం గమనార్హం. ఇక్కడితో ఆగలేదు. ఫాల్కే భార్య సరస్వతి బాయ్ ఫాల్కే పాత్రలో విద్య బాలన్ అయితే బాగుంటుందని రికమండేషన్ కూడా చేశాడు.
చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగే వ్యవహారంలా కనిపించడం లేదు. దీనికి సంబంధించిన అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజు కేవలం వార్ 2 ప్రమోషన్ మాత్రమే హైలైట్ చేయబోతున్నారట. ఇప్పుడీ ఫాల్కే ఇష్యూ కొత్త మలుపులు తిరగడంతో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కన్నా ముందు ఈ అనుమానాలు తీర్చుకోవడం అవసరం. రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఇటు అమీర్ వైపు నుంచి అధికారికంగా ఏం చెప్పడం లేదు. మీడియా కథనాల్లో మాత్రం తారక్ వర్సెస్ అమీర్ అంటూ రకరకాల విశ్లేషణలు, డిబేట్లు కొనసాగుతున్నాయి.
This post was last modified on May 17, 2025 11:42 am
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…