సౌత్ ఇండియాలో తెరపై మంచి జోడీలుగా పేరు తెచ్చుకుని నిజ జీవితంలోనూ జంటగా మారిన వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సూర్య, జ్యోతికల గురించే. వీళ్లిద్దరూ కలిసి తమిళంలో ఏడు సినిమాలు చేశారు. ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
వివాహం తర్వాత సూర్య కుటుంబంలో చాలా బాగా కలిసిపోయి చక్కటి గృహిణిగా మారిపోయింది జ్యోతిక. ఐతే ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్లు కొంచెం పెరిగి పెద్దయ్యాక ఆమె మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేయాలనుకుంటే సూర్య ఏమీ అడ్డు చెప్పలేదు. పైగా సొంత బేనర్లో మంచి కథలతో ఆమెను లీడ్ రోల్లో పెట్టి సినిమాలు నిర్మించాడు. జ్యోతిక పునరాగమనంలో చేసిన సినిమాలన్నీ మహిళల సమస్యలు, వాళ్ల సాధికారత చుట్టూ తిరిగేవే కావడం విశేషం. అవి వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి.
చివరగా ‘పొన్ మగళ్ వందాల్’ సినిమాతో జ్యోతిక పలకరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం అమేజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఇప్పుడు అదే ఓటీటీలో తన కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ను కూడా రిలీజ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే త్వరలోనే సూర్య, జ్యోతిక కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న సమాచారం వారి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. వీళ్లిద్దరి కోసం మలయాళ దర్శకురాలు అంజలి మీనన్.. తమిళ డైరెక్టర్ హాలిత కలిసి ఓ కథ రాస్తోందట.
ఇందులో సూర్య, జ్యోతికల వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తారట. అంజలి ఇంతకుముందు ‘బెంగళూరు డేస్’ లాంటి క్లాసిక్ను అందంచంది. ఆ తర్వాత మరి కొన్ని మంచి సినిమాలు తీసింది. మంచి అభిరుచి ఉన్న దర్శకురాలు కావడంతో ఆమెతో బహు భాషా చిత్రం చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫీల్ గుడ్ సినిమాలు తీసే అంజలి సూర్య, జ్యోతికల కోసం ఎలాంటి కథ రాస్తుంది.. వాళ్లనెలా ప్రెజెంట్ చేస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on November 6, 2020 4:55 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…