సౌత్ ఇండియాలో తెరపై మంచి జోడీలుగా పేరు తెచ్చుకుని నిజ జీవితంలోనూ జంటగా మారిన వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సూర్య, జ్యోతికల గురించే. వీళ్లిద్దరూ కలిసి తమిళంలో ఏడు సినిమాలు చేశారు. ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
వివాహం తర్వాత సూర్య కుటుంబంలో చాలా బాగా కలిసిపోయి చక్కటి గృహిణిగా మారిపోయింది జ్యోతిక. ఐతే ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్లు కొంచెం పెరిగి పెద్దయ్యాక ఆమె మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేయాలనుకుంటే సూర్య ఏమీ అడ్డు చెప్పలేదు. పైగా సొంత బేనర్లో మంచి కథలతో ఆమెను లీడ్ రోల్లో పెట్టి సినిమాలు నిర్మించాడు. జ్యోతిక పునరాగమనంలో చేసిన సినిమాలన్నీ మహిళల సమస్యలు, వాళ్ల సాధికారత చుట్టూ తిరిగేవే కావడం విశేషం. అవి వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి.
చివరగా ‘పొన్ మగళ్ వందాల్’ సినిమాతో జ్యోతిక పలకరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం అమేజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఇప్పుడు అదే ఓటీటీలో తన కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ను కూడా రిలీజ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే త్వరలోనే సూర్య, జ్యోతిక కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న సమాచారం వారి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. వీళ్లిద్దరి కోసం మలయాళ దర్శకురాలు అంజలి మీనన్.. తమిళ డైరెక్టర్ హాలిత కలిసి ఓ కథ రాస్తోందట.
ఇందులో సూర్య, జ్యోతికల వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తారట. అంజలి ఇంతకుముందు ‘బెంగళూరు డేస్’ లాంటి క్లాసిక్ను అందంచంది. ఆ తర్వాత మరి కొన్ని మంచి సినిమాలు తీసింది. మంచి అభిరుచి ఉన్న దర్శకురాలు కావడంతో ఆమెతో బహు భాషా చిత్రం చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫీల్ గుడ్ సినిమాలు తీసే అంజలి సూర్య, జ్యోతికల కోసం ఎలాంటి కథ రాస్తుంది.. వాళ్లనెలా ప్రెజెంట్ చేస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on November 6, 2020 4:55 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…