న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే బిజినెస్ డీల్స్ హాట్ గా మారిపోతున్నాయి. తాజాగా ఆడియో హక్కులను సరిగమ సంస్థ 18 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబోకున్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం పెట్టడం సబబేనని భావించిన సదరు కంపెనీ తాజగా ఒప్పందం పూర్తి చేసుకుందని సమాచారం. గతంలో నాని, అనిరుధ్ కలయికలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ వచ్చాయి. మ్యూజికల్ గా రెండూ పెద్ద హిట్సే. పాటల పరంగా మ్యూజిక్ లవర్స్ ని నిరాశపరచలేదు.
ది ప్యారడైజ్ మీద ట్రేడ్ లో చాలా హైప్ ఉంది. టీజర్ లో చూపించిన శాంపిల్, కంటెంట్ ఎంత బోల్డ్ గా ఉండబోతోందో డైలాగుల ద్వారా శ్రీకాంత్ ఓదెల చెప్పిన విధానం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. నాని కెరీర్ లోనే కాదు ఇప్పటిదాకా టాలీవుడ్ హీరోల్లో చాలా తక్కువ మంది కనిపించిన షాకింగ్ ట్విస్టు తన క్యారెక్టర్ లో ఉంటుందని ఇప్పటికే టాక్ ఉన్న నేపథ్యంలో ఈ హైప్ ని దృష్టిలో పెట్టుకునే అంత మొత్తాన్ని ఆడియో కోసం వెచ్చించడానికి సరిగమ సిద్ధమయ్యింది. ఇంకా సాంగ్స్ రికార్డింగ్ మొదలవ్వలేదు. నాని ఫ్రీ అయ్యాక త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ఒక కొలిక్కి తేలబోతున్నట్టు సమాచారం.
వచ్చే ఏడాది మార్చి 26 విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ కు పోటీగా రామ్ చరణ్ పెద్ది వస్తున్నప్పటికీ వాయిదా వేసుకునే ఆలోచనలో నాని ఎంతమాత్రం లేడు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రెండు ఆడతాయనే ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడు ప్యారడైజ్ కు ఏర్పడుతున్న డిమాండ్ చూస్తుంటే నాని మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 ది థర్డ్ కేస్ ఇలా వరసగా దూసుకుపోతున్న వైనం దానికి తగ్గట్టే రేట్లను పెంచుకుంటూ పోతోంది. ప్యారడైజ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. రెగ్యులర్ షూట్ కు వెళ్ళాక మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…