ముప్పై అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా రీ రిలీజైతే దానికి అభిమానులు రావడంలో ఆశ్చర్యం లేదు కానీ వాళ్ళతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యులు థియేటర్లకు తరలి రావడం ఖచ్చితంగా విశేషమే. జగదేకవీరుడు అతిలోకసుందరి విషయంలో ఇది జరుగుతోంది. శుక్రవారం వైజయంతి మూవీస్ ఘనంగా విడుదల చేసిన ఈ ఫాంటసీ మూవీకి ఆదరణ దక్కుతున్న వైనం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మొదటి రోజే పన్నెండు లక్షలకు పైగా గ్రాస్ నమోదు కావడం చిన్న విషయం కాదు. ఆదివారం వీకెండ్ షోలు చాలా మటుకు ఫుల్ అయ్యాయి. నిన్నటితోనే వరల్డ్ వైడ్ గ్రాస్ రెండున్నర కోట్లు రాబట్టింది ఒక అంచనా.
ఇక్కడే కాదు విజయవాడ, గుంటూరు, వైజాగ్, మచిలీపట్నం తదితర నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాము చిన్నప్పుడు నాన్నలతో కలిసి చూసిన విజువల్ వండర్ ని ఇప్పుడు త్రిడిలో తమ పిల్లలతో కలిసి చూడటాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్. హాలు లోపల సెలబ్రేషన్స్, అబ్బని తీయని దెబ్బ పాటకు చిరంజీవి శ్రీదేవి కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి యువతీ యువకులు డాన్సులు చేస్తున్న వైనం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినిమా చూసి బయటికొచ్చిన పబ్లిక్ మీడియాతో పంచుకుంటున్న రియాక్షన్లు జనాల సంతోషాన్ని బయట పెడుతున్నాయి.
ప్రింట్ క్వాలిటీ గురించి కొంత కంప్లయింట్ ఉన్నప్పటికీ ఆడియన్స్ దక్కించుకుంటున్న వింటేజ్ ఫీలింగ్ ముందు అదేమీ హైలైట్ కావడం లేదు కానీ ఒకవేళ అది కూడా బెస్ట్ వచ్చి ఉంటే ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకునేవాళ్ళన్నది వాస్తవం. మొత్తానికి జగదేకవీరుడు అతిలోకసుందరికొచ్చిన రెస్పాన్స్ మరిన్ని క్లాసిక్స్ ని బయటికి తెచ్చేలా ఉంది. చిరంజీవి కౌ బాయ్ మూవీ కొదమసింహంకు ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 90 దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ కి కనెక్టివిటీ ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ టైంలో వచ్చిన హిట్ సినిమాల నిర్మాతలను సంప్రదించే పనిని డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే మొదలుపెట్టారట.
This post was last modified on May 12, 2025 12:21 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…