ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవై డెబ్భై వయసు దాటిన ఇద్దరు సీనియర్ స్టార్లతో మల్టీస్టారర్ చేయడం అంత సులభం కాదు. అసలు తక్కువ ఈడులో ఉన్న ఇప్పటి హీరోలను కలపడమే కష్టంగా ఉన్న దర్శకులు అందుకే ఇలాంటి కాంబోల గురించి ఆలోచించడం మానేశారు. కానీ లోకేష్ కనగరాజ్ శైలి వేరు. రజనీకాంత్, కమల్ హాసన్ లను పెట్టి ఒక సినిమా తీస్తానని అంటున్నాడు. ఇటీవలే ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన తమిళ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు. అందులో సూపర్ స్టార్, లోక నాయకుడు ప్రస్తావన వచ్చింది. ఈ కలయికకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.
ఇద్దరు గ్యాంగ్ స్టర్లు వార్ధక్యంలోకి వచ్చాక ఏం చేస్తారనే పాయింట్ మీద సబ్జెక్టు రెడీ చేస్తానని, దానికి ఇద్దరూ సంసిద్ధంగా ఉన్నారని వివరించాడు. నిప్పు లేనిది పొగరాదు తరహాలో బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ జరుగుతోంది కాబట్టే లోకేష్ ఇంత ధీమాగా చెప్పి ఉండొచ్చు. ఈ కాంబో ఎందుకంత స్పెషల్ అంటే రజని, కమల్ కలిసి తెరను పంచుకుని అక్షరాలా 40 సంవత్సరాలు అయ్యింది. 1985లో రిలీజైన బాలీవుడ్ మూవీ గిరఫ్తార్ లో చివరిసారి కలిసి నటించారు. సుమారు పదిహేను సినిమాలు వీళ్ళ కలయికలో ఉన్నాయి. పెరిగిన ఇమేజ్ దృష్ట్యా 90 దశకం నుంచి ఎవరూ ఈ సాహసం చేయలేకపోయారు.
లోకేష్ డైరెక్షన్ లో కమల్ విక్రమ్ చేస్తే రజనీకాంత్ కూలిలో నటించారు. ఎవరికి ఏ పాత్ర సూటవుతుందో దానికి అనుగుణంగానే హీరోలను ఎంచుకుంటాను తప్పించి కేవలం డేట్లున్నాయనే కారణంతో ఒకరికి సెట్టయ్యే స్టోరీ మరొకరికి చెప్పనంటున్నాడు లోకేష్. ఖైదీ 2 త్వరలోనే మొదలుపెట్టబోతున్న లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత రోలెక్స్, విక్రమ్ 2 లియో 2 లను లైన్ లో పెట్టాడు. వీటిలో రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీగా విడిగా వస్తుందట. సినిమాటిక్ యునివర్స్ లో అవసరాన్ని బట్టి కలపడం, వేరు చేయడం చేస్తానని చెబుతున్న లోకేష్ కి మాస్టర్ 2 తీయాలని కోరికగా ఉందట. కాకపోతే విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఛాన్స్ లేనట్టే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…