టాలీవుడ్లో బాగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే హీరోల్లో సుమంత్ ఒకడు. అతను మీడియా, సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. దీనికి తోడు చాలా ఏళ్ల నుంచి తన సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో లైమ్ లైట్లో లేకుండా పోయాడు. తన ఫిల్మ్, పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చర్చ ఉండదు. ఐతే సుమంత్ ఇప్పుడు ‘అనగనగా..’ అనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్లో ఈ సినిమా నేరుగా స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
మృణాల్ ఠాకూర్తో సుమంత్ పెళ్లంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి అడిగితే అతను షాకైపోయాడు. ఒక హీరో, హీరోయిన్ కొంచెం సన్నిహితంగా ఉన్న ఫొటో కనిపిస్తే చాలు.. జనాలు రకరకాల కథలు అల్లేస్తారు. అలాగే సుమంత్, మృణాల్ కలిసి ఉన్న ఫొటో చూసి ఇలాంటి ప్రచారానికే తెర తీశారు. దీని గురించి సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. తాను మృణాల్తో కలిసి ‘సీతారామం’ సినిమా చేశానని.. ఆ టైంలో ప్రమోషన్ల సందర్భంగా దిగిన ఫొటో అదని.. అంతకుమించి పర్సనల్గా తమ మధ్య ఏమీ లేదని సుమంత్ స్పష్టం చేశాడు.
తమ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతోందని తనకు తెలియదంటూ షాకయ్యాడు సుమంత్. ఇక తనకు సినిమాలు తప్ప ఏమీ తెలియదని.. ఉన్న సినిమాలేవో చేసుకుంటూ.. సంపాదించిన డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ సింపుల్గా జీవితాన్ని గడిపేస్తానని సుమంత్ తెలిపాడు. తనకు జిమ్ చేయడం, హోం థియేటర్లో సినిమాలు చూడడం, కుక్కలతో ఆడుకోవడంతో ఎక్కువ సమయం గడుస్తుందని.. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అని.. వారితో కొంత టైం స్పెండ్ చేస్తానని.. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటానని సుమంత్ తెలిపాడు.
This post was last modified on May 11, 2025 2:27 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…