టాలీవుడ్లో బాగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే హీరోల్లో సుమంత్ ఒకడు. అతను మీడియా, సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. దీనికి తోడు చాలా ఏళ్ల నుంచి తన సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో లైమ్ లైట్లో లేకుండా పోయాడు. తన ఫిల్మ్, పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చర్చ ఉండదు. ఐతే సుమంత్ ఇప్పుడు ‘అనగనగా..’ అనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్లో ఈ సినిమా నేరుగా స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
మృణాల్ ఠాకూర్తో సుమంత్ పెళ్లంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి అడిగితే అతను షాకైపోయాడు. ఒక హీరో, హీరోయిన్ కొంచెం సన్నిహితంగా ఉన్న ఫొటో కనిపిస్తే చాలు.. జనాలు రకరకాల కథలు అల్లేస్తారు. అలాగే సుమంత్, మృణాల్ కలిసి ఉన్న ఫొటో చూసి ఇలాంటి ప్రచారానికే తెర తీశారు. దీని గురించి సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. తాను మృణాల్తో కలిసి ‘సీతారామం’ సినిమా చేశానని.. ఆ టైంలో ప్రమోషన్ల సందర్భంగా దిగిన ఫొటో అదని.. అంతకుమించి పర్సనల్గా తమ మధ్య ఏమీ లేదని సుమంత్ స్పష్టం చేశాడు.
తమ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతోందని తనకు తెలియదంటూ షాకయ్యాడు సుమంత్. ఇక తనకు సినిమాలు తప్ప ఏమీ తెలియదని.. ఉన్న సినిమాలేవో చేసుకుంటూ.. సంపాదించిన డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ సింపుల్గా జీవితాన్ని గడిపేస్తానని సుమంత్ తెలిపాడు. తనకు జిమ్ చేయడం, హోం థియేటర్లో సినిమాలు చూడడం, కుక్కలతో ఆడుకోవడంతో ఎక్కువ సమయం గడుస్తుందని.. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అని.. వారితో కొంత టైం స్పెండ్ చేస్తానని.. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటానని సుమంత్ తెలిపాడు.
This post was last modified on May 11, 2025 2:27 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…