Movie News

క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. 1990 తుఫానులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్న టైంలో ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇళయరాజా పాటలు చెవుల్లో అమృతం పోస్తున్నా, చిరంజీవి శ్రీదేవి జంటను అలాగే చూస్తూ ఉండాలని అనిపించినా అదంతా దర్శకుడు రాఘవేంద్రరావు మహాత్యమే. అఫ్కోర్స్ నిర్మాత అశ్వినిదత్ సాహసాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. అంత గొప్ప క్లాసిక్ వెనుక మహా యజ్ఞమే జరిగింది.

అయితే దీనికి ఎప్పటి నుంచో సీక్వెల్ వస్తే బాగుంటుందనే డిమాండ్ బాహుబలి నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. దర్శకేంద్రులు సుముఖంగా లేనప్పటికీ అశ్వినీదత్ మాత్రం సిద్ధంగా ఉన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తే బాగుంటుందనేది చిరంజీవి వ్యక్తిగత కోరిక. ఇవాళ రిలీజ్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఒక ఇంటరెస్టింగ్ ట్విస్ట్ బయట పడింది. వీడియో ద్వారా టీమ్ తో మాట్లాడిన రామ్ చరణ్ జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఉంగరం ఏమైంది, చేప ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ని డిమాండ్ చేస్తున్నానని చెప్పడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.

అంటే తెరవెనుక దీని గురించి చర్చలైతే జరుగుతున్నాయన్న మాట. చరణ్ ప్రత్యేకంగా నాగ్ అశ్విన్ పేరే ప్రస్తావించడానికి కారణం ఆయన్ని డైరెక్ట్ చేయమని అడగటమేగా. నిజంగా రాజు ఇంద్రజలకు సంతానం కలిగి అతను రామ్ చరణ్ అయ్యి, ఇంకో లోకం నుంచి జాన్వీ కపూర్ వస్తే ఆ కలయిక చాలా బాగుంటుంది. నాగ్ అశ్విన్ కొంచెం సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేస్తే బాగుంటుంది. కల్కి 2 అయ్యాక తీస్తారేమో చూడాలి. ఎవర్ గ్రీన్ సెన్సేషన్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరికి పార్ట్ 2  వస్తే అదో కొత్త సంచలనం కావడం ఖాయం. ఆశపడటం బాగానే ఉంది కానీ నిజంగా కార్యరూపం దాలుస్తుందా.

This post was last modified on May 9, 2025 7:41 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago