డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే చదువు పక్కన పెట్టేయాల్సిందే అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చదువుకుంటూ సినిమాలు చేస్తున్న వాళ్లున్నారు. చదువు పూర్తి చేసి సినిమాల్లోకి అడుగు పెడుతున్న వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో డాక్టర్ అయ్యాక యాక్టర్లు అయిన వాళ్ల జాబితా పెద్దదే. సీనియర్ హీరోల్లో ఒకరైన రాజశేఖర్ ముఖానికి రంగేసుకోవడానికి పూర్వం డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఇక క్యారెక్టర్ రోల్స్తో పాపులర్ అయిన భరత్ కూడా డాక్టరే.
హీరోయిన్లలో ఈ జాబితాలో కొంచెం పెద్దదే. సాయిపల్లవి, మీనాక్షి చౌదరి, శ్రీ లీల, రూప కొడవయూర్, కామాక్షి భాస్కర్ల.. ఇలా చాలామందే డాక్టర్స్ టర్న్డ్ యాక్టర్స్ ఉన్నారు. ఈ జాబితాలోకి కొత్తగా చేరిన పేరు.. కోమలి ప్రసాద్.
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన నాని సినిమా ‘హిట్-3’లో కోమలి కీలక పాత్ర పోషించింది. రఫ్ అండ్ టఫ్ పోలీసాఫీసర్ పాత్రలో ఈ తెలుగమ్మాయి అదరగొట్టింది. హీరోయిన్ తర్వాత అంత ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ తనదే.
ఈ అమ్మాయి డెంటిస్ట్ అట. టీనేజీలోనే తాను నటి కావాలని అనుకున్నానని.. కానీ చదువు పూర్తయ్యాకే ఏదైనా అని చెప్పడంతో డెంటల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపింది. తర్వాత ఎంఎస్ కూడా చేద్దామని అనుకున్నానని.. కానీ అప్పుడే తనకు ‘నేను సీతాదేవి’ అనే సినిమాలో అవకాశం రావడంతో ఆ అప్లికేషన్ పక్కన పడేసి సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కోమలి నెపోలియన్, హిట్, టచ్ మి నాట్, లూజర్ (వెబ్ సిరీస్) లాంటి ప్రాజెక్టుల్లో నటించింది. కోమలి లీడ్ హీరోయిన్గా నటించిన ‘శశివదనే’ అనే చిత్రం విడుదల ఆలస్యం అవుతోంది. ఈలోపు ‘హిట్-3’లో నటించి మంచి పేరే సంపాదించింది కోమలి.
This post was last modified on May 8, 2025 9:22 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…