లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్ 5 విడుదల కాబోతున్న తగ్ లైఫ్ కోసం ఇప్పటి నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టేశారు. తెలుగు మీడియాని ప్రత్యేకంగా చెన్నై పిలిపించి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం అందులో భాగమే. నాయకుడు కలయిక జరిగిన ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత మణిరత్నంతో కమల్ చేసిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో హీరోగా శింబు నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం, పెద్ద క్యాస్టింగ్ లాంటి ఆకర్షణలు అంచనాలు పెంచుతున్నాయి. ఏపీ తెలంగాణలో భారీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇంత జాగ్రత్త వహించడం వెనుక కారణముంది. తగ్ లైఫ్ కి జూన్ 5 ముందు వెనుకా ఏ సినిమాలు పోటీకి వస్తాయో అంతు చిక్కడం లేదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మే 30 లేదా జూన్ 12 ఆప్షన్లు చూస్తోంది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రావొచ్చు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వచ్చేది దాదాపు ఖరారు అంటున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో అనుమానాలు లేకపోలేదు. జూన్ 20 కుబేర, సితారే జమీన్ పర్ అటుపై 27 కన్నప్ప వరసగా కాచుకుని ఉన్నాయి. సో మొదటి వారం పది రోజులు తగ్ లైఫ్ కు చాలా కీలకం. ఓపెనింగ్స్ రావాలంటే ఊరికే ఉంటే కుదరదు. అందుకే కమల్ స్వయంగా రంగంలోకి దిగారు.
విక్రమ్ బ్లాక్ బస్టర్ సాధించాక కమల్ హాసన్ కు భారతీయుడు 2 రూపంలో షాక్ కొట్టింది. ఆ గాయాన్ని పూర్తిగా మాన్పుతుందనే నమ్మకం తగ్ లైఫ్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ డబ్బింగ్ వెర్షన్లు ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ తగ్ లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని మణిరత్నం భావిస్తున్నారు. పైకి గ్యాంగ్ స్టర్ డ్రామాలా కనిపిస్తున్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఊహించని మలుపులు చాలానే ఉంటాయట. త్రిష హీరోయిన్ గా నటించగా సాన్య మల్హోత్రా లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఇందులో భాగమయ్యింది. తగ్ లైఫ్ కనక బ్లాక్ బస్టర్ అయితే రజనీకాంత్ తో ఓ మూవీ చేసే ప్లాన్ లో ఉన్నారు మణిరత్నం.
This post was last modified on May 8, 2025 6:28 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…