ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ఎందరికో అవకాశాలు, ఉపాధి దొరుకుతాయనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. 2016లో పెళ్లి చూపులుతో దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నారు. విజయ్ దేవరకొండకి తొలి హిట్టు ఇచ్చిన ఘనత తనకే దక్కింది. తర్వాత ఈ నగరానికి ఏమైంది కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా యూత్ లో దానికున్న కల్ట్ ఫాలోయింగ్ రీ రిలీజ్ టైంలో బయట పడింది. రెండేళ్ల క్రితం కీడా కోలాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు.
మళ్ళీ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు. ఏడాది క్రితం బినామి టైటిల్ తో విజయ్ దేవరకొండ హీరోగా ఒక ప్రాజెక్టు అనుకున్నారు కానీ అది చర్చల దశ దగ్గరే ఆగిపోయింది. ఈలోగా రౌడీ బాయ్ ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. కింగ్ డమ్, రౌడీ జనార్దనా, మైత్రి బ్యానర్ మూవీ (రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు) తో రెండు మూడేళ్లు దొరకనంతగా ప్యాకయ్యాడు. సో ఈ కాంబో ఇప్పుడప్పుడే జరిగే ఛాన్స్ లేదని అర్థమైపోయింది. కొత్త క్యాస్టింగ్ తో ఈ నగరానికి ఏమైంది 2 మీద వర్క్ జరుగుతోంది కానీ ఎప్పుడు మొదలుపెడతారనేది మాత్రం తరుణ్ భాస్కర్ కు మాత్రమే తెలుసు.
ఏది ఏమైనా కొత్త తరం డైరెక్టర్లు ఇంత నెమ్మదిగా ఉంటే కష్టం. వెయ్యి కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు స్లోగా వెళ్లడం ఓకే కానీ మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో వండర్స్ చేయగలిగిన తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు సైతం నిదానమే ప్రధానం అనడం కరెక్ట్ కాదు. రాజమౌళి, సుకుమార్ స్కూల్ లో టయర్ 1 హీరోలతో ఆలస్యమైతే ఏదో అనుకోవచ్చు. కానీ మీడియం బడ్జెట్ లు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా అదే దారి పడితే ఎలా. అన్నట్టు తరుణ్ భాస్కర్ హీరోగా చేసిన ఓ మలయాళ రీమేక్ రిలీజ్ కు రెడీ అవుతోంది. డైరెక్టర్ గా ఆర్టిస్టుగా ఎక్కువ ట్రయిల్స్ వేస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చివరికి ఏ కెరీర్ లో సెటిలవుతాడో చూడాలి.
This post was last modified on May 8, 2025 11:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…