ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ఎందరికో అవకాశాలు, ఉపాధి దొరుకుతాయనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. 2016లో పెళ్లి చూపులుతో దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నారు. విజయ్ దేవరకొండకి తొలి హిట్టు ఇచ్చిన ఘనత తనకే దక్కింది. తర్వాత ఈ నగరానికి ఏమైంది కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా యూత్ లో దానికున్న కల్ట్ ఫాలోయింగ్ రీ రిలీజ్ టైంలో బయట పడింది. రెండేళ్ల క్రితం కీడా కోలాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు.
మళ్ళీ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు. ఏడాది క్రితం బినామి టైటిల్ తో విజయ్ దేవరకొండ హీరోగా ఒక ప్రాజెక్టు అనుకున్నారు కానీ అది చర్చల దశ దగ్గరే ఆగిపోయింది. ఈలోగా రౌడీ బాయ్ ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. కింగ్ డమ్, రౌడీ జనార్దనా, మైత్రి బ్యానర్ మూవీ (రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు) తో రెండు మూడేళ్లు దొరకనంతగా ప్యాకయ్యాడు. సో ఈ కాంబో ఇప్పుడప్పుడే జరిగే ఛాన్స్ లేదని అర్థమైపోయింది. కొత్త క్యాస్టింగ్ తో ఈ నగరానికి ఏమైంది 2 మీద వర్క్ జరుగుతోంది కానీ ఎప్పుడు మొదలుపెడతారనేది మాత్రం తరుణ్ భాస్కర్ కు మాత్రమే తెలుసు.
ఏది ఏమైనా కొత్త తరం డైరెక్టర్లు ఇంత నెమ్మదిగా ఉంటే కష్టం. వెయ్యి కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు స్లోగా వెళ్లడం ఓకే కానీ మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో వండర్స్ చేయగలిగిన తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు సైతం నిదానమే ప్రధానం అనడం కరెక్ట్ కాదు. రాజమౌళి, సుకుమార్ స్కూల్ లో టయర్ 1 హీరోలతో ఆలస్యమైతే ఏదో అనుకోవచ్చు. కానీ మీడియం బడ్జెట్ లు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా అదే దారి పడితే ఎలా. అన్నట్టు తరుణ్ భాస్కర్ హీరోగా చేసిన ఓ మలయాళ రీమేక్ రిలీజ్ కు రెడీ అవుతోంది. డైరెక్టర్ గా ఆర్టిస్టుగా ఎక్కువ ట్రయిల్స్ వేస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చివరికి ఏ కెరీర్ లో సెటిలవుతాడో చూడాలి.
This post was last modified on May 8, 2025 11:55 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…