ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు వారాల నుంచి రెండు నెలల మధ్యలోనే కొత్త సినిమాలు డిజిటల్ లో వస్తుంటే ప్రేక్షకులు టికెట్లు ఎందుకు కొంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇండియాలో స్క్రీన్లు చాలట్లేదు, జపాన్ చైనా తరహాలో వేలాదిగా కొత్తవి అందుబాటులోకి రావాలని అన్నాడు. వినడానికి ఇదంతా బాగానే ఉంది కదా, అమీర్ కున్న దూరాలోచనకు అందరూ సూపర్ అనుకున్నారు. తీరా చూస్తే కబుర్లు చెప్పేందుకు తప్ప పాటించడానికి కాదనేలా ఉంది అమీర్ ఖాన్ వ్యవహారం. బాలీవుడ్ మీడియా అదే చెబుతోంది.
జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేసే ఆలోచన సీరియస్ గా చేస్తున్నారట. అంటే ఓటిటిలకు అమ్మకుండా తనకే ప్రతి రూపాయి వచ్చే ప్లాన్ అన్నమాట. ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే కట్టుదిట్టమైన ఫైర్ వాల్స్ ఉండే అంతర్జాతీయ ఓటిటిలనే వదలకుండా పైరసీ చేస్తున్నారు చోరులు. అలాంటిది యూట్యూబ్ లో పెడితే ఊరుకుంటారా. అసలే ఇది హెచ్డి పైరసీ ట్రెండ్. రిలీజైన రోజు సాయంత్రానికే అదిరిపోయే ప్రింట్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటప్పుడు అమీర్ ది తెలివైన ఆలోచన కాదు.
సరే ఆయన సినిమా ఆయన ఇష్టం అనుకున్నా మరి వేవ్స్ 2025లో అన్నేసి నీతిబోధలు చేయడం ఎందుకనేదే అసలు ప్రశ్న. లాల్ సింగ్ చద్దాతో బాగా డిస్ట్రబ్ అయిన అమీర్ ఖాన్ ఆశలన్నీ సితారే జమీన్ పర్ మీదే ఉన్నాయి. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యూత్ డ్రామా తనకు పూర్వ వైభవం తెస్తుందని నమ్ముతున్నాడు. నాగార్జున, ధనుష్ కుబేరతో పోటీ పడుతున్న సితారే జమీన్ పర్ డిజిటల్ డీల్ కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ అమీర్ చేసేది మాత్రం రిస్కే. మరి పరిణామాలు ముందే అలోచించి డెసిషన్ మార్చుకుంటాడో లేదో చూడాలి.
This post was last modified on May 8, 2025 12:08 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…