ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు వారాల నుంచి రెండు నెలల మధ్యలోనే కొత్త సినిమాలు డిజిటల్ లో వస్తుంటే ప్రేక్షకులు టికెట్లు ఎందుకు కొంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇండియాలో స్క్రీన్లు చాలట్లేదు, జపాన్ చైనా తరహాలో వేలాదిగా కొత్తవి అందుబాటులోకి రావాలని అన్నాడు. వినడానికి ఇదంతా బాగానే ఉంది కదా, అమీర్ కున్న దూరాలోచనకు అందరూ సూపర్ అనుకున్నారు. తీరా చూస్తే కబుర్లు చెప్పేందుకు తప్ప పాటించడానికి కాదనేలా ఉంది అమీర్ ఖాన్ వ్యవహారం. బాలీవుడ్ మీడియా అదే చెబుతోంది.
జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేసే ఆలోచన సీరియస్ గా చేస్తున్నారట. అంటే ఓటిటిలకు అమ్మకుండా తనకే ప్రతి రూపాయి వచ్చే ప్లాన్ అన్నమాట. ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే కట్టుదిట్టమైన ఫైర్ వాల్స్ ఉండే అంతర్జాతీయ ఓటిటిలనే వదలకుండా పైరసీ చేస్తున్నారు చోరులు. అలాంటిది యూట్యూబ్ లో పెడితే ఊరుకుంటారా. అసలే ఇది హెచ్డి పైరసీ ట్రెండ్. రిలీజైన రోజు సాయంత్రానికే అదిరిపోయే ప్రింట్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటప్పుడు అమీర్ ది తెలివైన ఆలోచన కాదు.
సరే ఆయన సినిమా ఆయన ఇష్టం అనుకున్నా మరి వేవ్స్ 2025లో అన్నేసి నీతిబోధలు చేయడం ఎందుకనేదే అసలు ప్రశ్న. లాల్ సింగ్ చద్దాతో బాగా డిస్ట్రబ్ అయిన అమీర్ ఖాన్ ఆశలన్నీ సితారే జమీన్ పర్ మీదే ఉన్నాయి. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యూత్ డ్రామా తనకు పూర్వ వైభవం తెస్తుందని నమ్ముతున్నాడు. నాగార్జున, ధనుష్ కుబేరతో పోటీ పడుతున్న సితారే జమీన్ పర్ డిజిటల్ డీల్ కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ అమీర్ చేసేది మాత్రం రిస్కే. మరి పరిణామాలు ముందే అలోచించి డెసిషన్ మార్చుకుంటాడో లేదో చూడాలి.
This post was last modified on May 8, 2025 12:08 am
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…