కరోనా-లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ పెద్ద హీరోల్లో అందరికంటే ముందు చిత్రీకరణలో పాల్గొన్నది అక్కినేని నాగార్జుననే. మిగతా స్టార్లు ఇంకా భయపడుతుండగానే నాగ్ రంగంలోకి దిగి ‘వైల్డ్ డాగ్’ షూటింగ్లో పాల్గొన్నాడు. ఆ పనిలో ఉండగానే ‘బిగ్ బాస్’ కూడా మొదలుపెట్టేశాడు. అందులోనూ బిజీ అయ్యాడు. ఓవైపు ‘వైల్డ్ డాగ్’ షూట్ చేస్తూనే.. ఖాళీ దొరికినపుడు ‘బిగ్ బాస్’కు వెళ్లాడు.
మధ్యలో ‘వైల్డ్ డాగ్’ కోసమని ‘బిగ్ బాస్’కు కొంత విరామం ఇచ్చి.. మనాలిలో చిత్రీకరణ కోసం వెళ్లాడు నాగ్. అక్కడికి వెళ్లడంలో, రావడంలో ఆలస్యం జరగకూడదని.. ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టరే ఏర్పాటు చేసింది మా టీవీ యాజమాన్యం. అక్కడ షూటింగ్ ముగియడం ఆలస్యం.. వెంటనే హెలికాఫ్టర్ ఎక్కి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాడు. తిరిగి ‘బిగ్ బాస్’ బాధ్యతలు తీసుకున్నాడు.
ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ షూటింగ్కు కొంత విరామం ఇచ్చిన నాగ్.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ దాని చిత్రీకరణకు వెళ్లనున్నాడు. అలాగని ఇప్పుడేమీ ఆయన ఖాళీగా ఉండట్లేదు. ఓవైపు వీకెండ్స్లో ‘బిగ్ బాస్’ చేస్తూనే మధ్యలో ముంబయిలో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. నాగ్ చాలా ఏళ్ల తర్వాత హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో నాగ్ పాత్ర అరగంట పాటు ఉంటుంది. ఇంతకుముందే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు నాగ్. తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. కరోనా విరామం తర్వాత ఆ చిత్రం మళ్లీ సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం తెరపైకి వచ్చింది.
సినిమా నిడివిని మూడు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గించాలని నిర్మాణ భాగస్వామి అయిన ఫాక్స్ స్టార్ సంస్థ చెప్పగా.. మరో నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ససేమిరా అన్నారట. ఐతే చర్చల తర్వాత సమస్య పరిష్కారం అయింది. కరణ్, అయాన్లు అనుకున్నట్లే 3 గంటల నిడివితోనే సినిమా రాబోతోందట. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 5, 2020 3:33 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…