షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల రూపంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మే 30 థియేటర్ రిలీజ్ జరిగిపోవాలి. అదే జరిగితే టీమ్ మీద విపరీతమైన ఒత్తిడి నెలకొంటుంది. ఎందుకంటే ఇరవై రెండు రోజుల్లో హైప్ మార్చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల సంగతేమో కానీ అసలు అభిమానుల్లోనే సినిమా మీద హైప్ పెద్దగా లేదు. అసలు కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందని, ట్రైలర్ చూశాక అందరి అభిప్రాయాలు మారిపోతాయని టీమ్ అంటోంది. దానికీ డేట్ ఫిక్స్ చేయాలి.
ఒకవేళ ప్రైమ్ కనక వాయిదాకు ఒప్పుకుంటే జూన్ 12 విడుదల చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్. ఇవాళ ముంబైలో దీనికి సంబంధించి చర్చలు జరగబోతున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా ఇదే. మే 30 ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు. పైగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ఇంకొంచెం లేట్ కావడం మంచిదే. ఎలాగూ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మే 30 ఉంది కాబట్టి దానికి దారి వదిలినట్టు ఉంటుంది. రత్నం ఎలాంటి కబురు తీసుకొస్తారనే దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.
టీజర్ కాకుండా నేరుగా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారని మరో సమాచారం. అదెప్పుడనేది రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. పబ్లిసిటీ పరంగా ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలనే దాని గురించి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారట. ప్యాన్ ఇండియా విడుదల కాబట్టి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అవసరమవుతాయి. పవన్ కళ్యాణ్ ఎక్కువ వాటిలో పాల్గొనకపోవచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ అందుబాటులోనే ఉంది. కీరవాణి పాల్గొంటారు. బాబీ డియోల్ డేట్లు ఉంటే వచ్చి ప్రమోట్ చేస్తాడు. వీటన్నటి కంటే ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 థియేటర్లకు ఎప్పుడు వస్తుందనేది తేలితే అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది.
This post was last modified on May 7, 2025 10:18 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…