షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల రూపంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మే 30 థియేటర్ రిలీజ్ జరిగిపోవాలి. అదే జరిగితే టీమ్ మీద విపరీతమైన ఒత్తిడి నెలకొంటుంది. ఎందుకంటే ఇరవై రెండు రోజుల్లో హైప్ మార్చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల సంగతేమో కానీ అసలు అభిమానుల్లోనే సినిమా మీద హైప్ పెద్దగా లేదు. అసలు కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందని, ట్రైలర్ చూశాక అందరి అభిప్రాయాలు మారిపోతాయని టీమ్ అంటోంది. దానికీ డేట్ ఫిక్స్ చేయాలి.
ఒకవేళ ప్రైమ్ కనక వాయిదాకు ఒప్పుకుంటే జూన్ 12 విడుదల చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్. ఇవాళ ముంబైలో దీనికి సంబంధించి చర్చలు జరగబోతున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా ఇదే. మే 30 ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు. పైగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ఇంకొంచెం లేట్ కావడం మంచిదే. ఎలాగూ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మే 30 ఉంది కాబట్టి దానికి దారి వదిలినట్టు ఉంటుంది. రత్నం ఎలాంటి కబురు తీసుకొస్తారనే దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.
టీజర్ కాకుండా నేరుగా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారని మరో సమాచారం. అదెప్పుడనేది రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. పబ్లిసిటీ పరంగా ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలనే దాని గురించి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారట. ప్యాన్ ఇండియా విడుదల కాబట్టి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అవసరమవుతాయి. పవన్ కళ్యాణ్ ఎక్కువ వాటిలో పాల్గొనకపోవచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ అందుబాటులోనే ఉంది. కీరవాణి పాల్గొంటారు. బాబీ డియోల్ డేట్లు ఉంటే వచ్చి ప్రమోట్ చేస్తాడు. వీటన్నటి కంటే ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 థియేటర్లకు ఎప్పుడు వస్తుందనేది తేలితే అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…