షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల రూపంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మే 30 థియేటర్ రిలీజ్ జరిగిపోవాలి. అదే జరిగితే టీమ్ మీద విపరీతమైన ఒత్తిడి నెలకొంటుంది. ఎందుకంటే ఇరవై రెండు రోజుల్లో హైప్ మార్చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల సంగతేమో కానీ అసలు అభిమానుల్లోనే సినిమా మీద హైప్ పెద్దగా లేదు. అసలు కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందని, ట్రైలర్ చూశాక అందరి అభిప్రాయాలు మారిపోతాయని టీమ్ అంటోంది. దానికీ డేట్ ఫిక్స్ చేయాలి.
ఒకవేళ ప్రైమ్ కనక వాయిదాకు ఒప్పుకుంటే జూన్ 12 విడుదల చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్. ఇవాళ ముంబైలో దీనికి సంబంధించి చర్చలు జరగబోతున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా ఇదే. మే 30 ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు. పైగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ఇంకొంచెం లేట్ కావడం మంచిదే. ఎలాగూ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మే 30 ఉంది కాబట్టి దానికి దారి వదిలినట్టు ఉంటుంది. రత్నం ఎలాంటి కబురు తీసుకొస్తారనే దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.
టీజర్ కాకుండా నేరుగా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారని మరో సమాచారం. అదెప్పుడనేది రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. పబ్లిసిటీ పరంగా ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలనే దాని గురించి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారట. ప్యాన్ ఇండియా విడుదల కాబట్టి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అవసరమవుతాయి. పవన్ కళ్యాణ్ ఎక్కువ వాటిలో పాల్గొనకపోవచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ అందుబాటులోనే ఉంది. కీరవాణి పాల్గొంటారు. బాబీ డియోల్ డేట్లు ఉంటే వచ్చి ప్రమోట్ చేస్తాడు. వీటన్నటి కంటే ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 థియేటర్లకు ఎప్పుడు వస్తుందనేది తేలితే అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…