Movie News

సినిమా పరిశ్రమకు వార్ ముప్పు ఉందా

పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది. ఒకరకమైన యుద్ధ వాతావరణం ఇప్పటికే నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా అన్ని రాష్ట్రాలు సన్నద్ధంగా ఉండాలని, అందులో భాగంగా రేపు దేశమంతా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగే పక్షంలో ఎలా ఎదురుకోవాలనే దాని గురించి పోలీసులు, అధికారులు, పౌరులను ముందుగానే అప్రమత్తం చేయడం మాక్ డ్రిల్.

దీనికి ఇండస్ట్రీకి సంబంధం ఏమిటనుకోవచ్చు కానీ లింక్ ఉంది. ఒకవేళ నిజంగానే ఇండో పాక్ మధ్య వార్ లాంటిది వస్తే దాని ప్రభావం సామాన్య జనజీవనం మీద తీవ్రంగా ఉంటుంది. పబ్లిక్ బయటికి రావడానికి ఆలోచిస్తారు. వ్యవస్థ మొత్తం స్తంభించిపోదు కానీ జనాలు వినోదం మీద అంతగా దృష్టి పెట్టరు. పెద్ద ఎత్తున జరుగుతున్న దాడుల గురించి తెలుసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. అందులోనూ ఉత్తరాది రాష్ట్రాల మీద యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి థియేటర్ ఆక్యుపెన్సీలు రిస్క్ లో పడతాయి. ఇప్పుడేదో బాంబులు మిస్సైళ్లు పడతాయని కాదు కానీ శత్రువుల నుంచి ముప్పు ఏ రూపంలో అయినా ఉండొచ్చు.

ఇప్పటికిప్పుడు వార్ ముప్పు టాలీవుడ్ లేదా అన్ని వుడ్ ల మీద ఉంటుందా అంటే ఎంతో కొంత ఖచ్చితంగా లేకపోలేదు. కాకపోతే ఎంత మోతాదులో అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. అవి ప్రభుత్వాల చర్యల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ రద్దీలు ఎక్కువగా పోగయ్యే ప్రాంతాల మీద కఠిన ఆంక్షలు తీసుకొస్తే మటుకు ఫస్ట్ లిస్టులో థియేటర్లే ఉంటాయి. ఇదంతా ప్రస్తుతం ప్రాధమిక దశలో జరుగుతున్న చర్చలే కనక టెన్షన్ అక్కర్లేదు. ఒకవేళ ఇండియన్  ఆర్మీ రంగంలోకి దిగి పాక్ పీచమణిచే చర్యలకు పూనుకుంటే మాత్రం సినిమాల కన్నా ఎక్కువ న్యూస్ ఛానల్స్ కు డిమాండ్ పెరిగిపోవడం ఖాయం. చూడాలి ఏం జరుగుతుందో.

This post was last modified on May 7, 2025 9:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago