ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. కీలకమైన ఈ బాధ్యతను మంగళవారం దర్శకుడు అజయ్ భూపతికి ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. రాజకుమారుడుతో మహేష్ ని సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కథ ఓకే అయ్యిందని, స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నారని, ఎస్ఎస్ఎంబి 29కి బ్రేక్ ఇచ్చారు కాబట్టి మహేష్ ప్రస్తుతం ఈ పనులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.
ఇంత పర్సనల్ గా మహేష్ శ్రద్ధ తీసుకోవడానికి కారణాలు అనేకం. తనకన్నా ముందు హీరోగా తెరంగేట్రం చేసిన రమేష్ బాబు అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఎక్కువ కాలం హీరోగా కొనసాగలేదు. సూపర్ స్టార్ కృష్ణ తనవంతుగా పద్మాలయ బ్యానర్ మీద చాలా సినిమాలు తీశారు కానీ వాటిలో సక్సెస్ అయినవి తక్కువ. దీంతో రమేష్ నటన నుంచి విరమించుకుని ఇతర వ్యాపారాలు, నిర్మాణం వైపు వెళ్లిపోయారు. అన్నయ్య నట ప్రయాణం అలా అసంపూర్ణం కావడంతో పాటు వారసుడిని తెరమీద చూడక ముందే కన్నుమూయడం మహేష్ బాబుని జయకృష్ణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు దారి తీశాయి.
అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జయకృష్ణకు ఫ్యాన్స్ పరంగా మంచి మద్దతు దక్కే అవకాశాలు బోలెడు. కృష్ణ గారి మనవడు, మహేష్ అన్న కొడుకు, రమేష్ వారసుడు ఇలా నేరుగా రక్త సంబంధం ఉన్న హీరో కావడంతో సరైన నటన, కంటెంట్ తో వస్తే మటుకు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సుధీర్ బాబుతో పోల్చుకుంటే జయకృష్ణకు సపోర్ట్ ఎక్కువ రావడం సహజం. అందం, రూపంలో మహేష్ కు కాస్త దగ్గరగా అనిపించే జయకృష్ణ ఇప్పటికే నటన, డాన్స్, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నాడని సమాచారం. ఒక పెద్ద ఈవెంట్ ద్వారా ఓపెనింగ్ చేయోచ్చని టాక్.
This post was last modified on May 6, 2025 6:05 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…