Movie News

అన్న కొడుకు ఎంట్రీకి మహేష్ బాబు ప్లానింగ్

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. కీలకమైన ఈ బాధ్యతను మంగళవారం దర్శకుడు అజయ్ భూపతికి ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. రాజకుమారుడుతో మహేష్ ని సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కథ ఓకే అయ్యిందని, స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నారని, ఎస్ఎస్ఎంబి 29కి బ్రేక్ ఇచ్చారు కాబట్టి మహేష్ ప్రస్తుతం ఈ పనులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.

ఇంత పర్సనల్ గా మహేష్ శ్రద్ధ తీసుకోవడానికి కారణాలు అనేకం. తనకన్నా ముందు హీరోగా తెరంగేట్రం చేసిన రమేష్ బాబు అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఎక్కువ కాలం హీరోగా కొనసాగలేదు. సూపర్ స్టార్ కృష్ణ తనవంతుగా పద్మాలయ బ్యానర్ మీద చాలా సినిమాలు తీశారు కానీ వాటిలో సక్సెస్ అయినవి తక్కువ. దీంతో రమేష్ నటన నుంచి విరమించుకుని ఇతర వ్యాపారాలు, నిర్మాణం వైపు వెళ్లిపోయారు. అన్నయ్య నట ప్రయాణం అలా అసంపూర్ణం కావడంతో పాటు వారసుడిని తెరమీద చూడక ముందే కన్నుమూయడం మహేష్ బాబుని జయకృష్ణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు దారి తీశాయి.

అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జయకృష్ణకు ఫ్యాన్స్ పరంగా మంచి మద్దతు దక్కే అవకాశాలు బోలెడు. కృష్ణ గారి మనవడు, మహేష్ అన్న కొడుకు, రమేష్ వారసుడు ఇలా నేరుగా రక్త సంబంధం ఉన్న హీరో కావడంతో సరైన నటన, కంటెంట్ తో వస్తే మటుకు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సుధీర్ బాబుతో పోల్చుకుంటే జయకృష్ణకు సపోర్ట్ ఎక్కువ రావడం సహజం. అందం, రూపంలో మహేష్ కు కాస్త దగ్గరగా అనిపించే జయకృష్ణ ఇప్పటికే నటన, డాన్స్, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నాడని  సమాచారం. ఒక పెద్ద ఈవెంట్ ద్వారా ఓపెనింగ్ చేయోచ్చని టాక్.

This post was last modified on May 6, 2025 6:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

1 hour ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago