మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని సంప్రదింపులు జరిపినప్పటికీ చివరికి బంతి నయనతార దగ్గర ఆగినట్టు ఫిలిం నగర్ టాక్. రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఆలస్యం చేయడానికి అనిల్ దగ్గర ఎక్కువ టైం లేదు. ఎందుకంటే 2026 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే మే మినహాయించి చేతిలో ఉన్న ఏడు నెలల్లో కాపీ సిద్ధమైపోవాలి. మధ్యలో విశ్వంభర విడుదల, ప్రమోషన్లు, ఈవెంట్లు ఇవన్నీ కలుపుకునే అంత టైం మాత్రమే మిగిలి ఉంది.
ఒకవేళ నయన్ కనక ఓకే అయితే ఈ కాంబోలో మూడో సినిమా అవుతుంది. మొదటిది సైరా నరసింహారెడ్డిలో భార్యగా చేసిన పాత్ర ఏమంత పేరు తీసుకురాలేదు. ఫలితం కూడా యావరేజ్ గానే రావడంతో ల్యాండ్ మార్క్ మూవీ అవ్వలేదు. రెండోది గాడ్ ఫాదర్. చిరంజీవి చెల్లెలుగా నయన్ పాత్ర బాగానే ఉన్నప్పటికీ బ్యాలన్స్ తప్పిన పొలిటికల్ కంటెంట్ ఆడియన్స్, ఫ్యాన్స్ ని పూర్తిగా మెప్పించలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ అంత బలంగా లేకపోవడంతో చాలా ఏరియాల్లో ఫ్లాప్ గా నిలిచింది. సో ఇప్పుడు హ్యాట్రిక్ అవ్వకుండా సూపర్ హిట్ బోణీ జరగాలి. ఫ్యాన్స్ కోరుకునేది అదే.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి వచ్చే దాకా వెయిట్ చేయాలి. ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది కానీ అది నిజం కాదట. ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు కానీ దానికి సంబంధించి క్లారిటీ లేదు. స్క్రిప్ట్ లాక్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం లొకేషన్ల వేట, క్యాస్టింగ్ పనుల్లో ఉన్నాడు. వేసవిలో రెగ్యులర్ షూట్ కు వెళ్లే ప్రతిపాదన ఉంది. విశ్వంభరకు సంబంధించి ఇంకొక్క పాట పెండింగ్ ఉంది. డబ్బింగ్ పనులున్నాయి. మొత్తానికి పండగ డెడ్ లైన్ పెట్టుకున్న రావిపూడికి పెద్ద బరువు బాధ్యతలే పడబోతున్నాయి. ముఖ్యంగా అభిమానులు కోరుకుంటున్న వింటేజ్ చిరుని చూపించే విషయంలో.
This post was last modified on May 4, 2025 11:35 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…