మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని సంప్రదింపులు జరిపినప్పటికీ చివరికి బంతి నయనతార దగ్గర ఆగినట్టు ఫిలిం నగర్ టాక్. రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఆలస్యం చేయడానికి అనిల్ దగ్గర ఎక్కువ టైం లేదు. ఎందుకంటే 2026 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే మే మినహాయించి చేతిలో ఉన్న ఏడు నెలల్లో కాపీ సిద్ధమైపోవాలి. మధ్యలో విశ్వంభర విడుదల, ప్రమోషన్లు, ఈవెంట్లు ఇవన్నీ కలుపుకునే అంత టైం మాత్రమే మిగిలి ఉంది.
ఒకవేళ నయన్ కనక ఓకే అయితే ఈ కాంబోలో మూడో సినిమా అవుతుంది. మొదటిది సైరా నరసింహారెడ్డిలో భార్యగా చేసిన పాత్ర ఏమంత పేరు తీసుకురాలేదు. ఫలితం కూడా యావరేజ్ గానే రావడంతో ల్యాండ్ మార్క్ మూవీ అవ్వలేదు. రెండోది గాడ్ ఫాదర్. చిరంజీవి చెల్లెలుగా నయన్ పాత్ర బాగానే ఉన్నప్పటికీ బ్యాలన్స్ తప్పిన పొలిటికల్ కంటెంట్ ఆడియన్స్, ఫ్యాన్స్ ని పూర్తిగా మెప్పించలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ అంత బలంగా లేకపోవడంతో చాలా ఏరియాల్లో ఫ్లాప్ గా నిలిచింది. సో ఇప్పుడు హ్యాట్రిక్ అవ్వకుండా సూపర్ హిట్ బోణీ జరగాలి. ఫ్యాన్స్ కోరుకునేది అదే.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి వచ్చే దాకా వెయిట్ చేయాలి. ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది కానీ అది నిజం కాదట. ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు కానీ దానికి సంబంధించి క్లారిటీ లేదు. స్క్రిప్ట్ లాక్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం లొకేషన్ల వేట, క్యాస్టింగ్ పనుల్లో ఉన్నాడు. వేసవిలో రెగ్యులర్ షూట్ కు వెళ్లే ప్రతిపాదన ఉంది. విశ్వంభరకు సంబంధించి ఇంకొక్క పాట పెండింగ్ ఉంది. డబ్బింగ్ పనులున్నాయి. మొత్తానికి పండగ డెడ్ లైన్ పెట్టుకున్న రావిపూడికి పెద్ద బరువు బాధ్యతలే పడబోతున్నాయి. ముఖ్యంగా అభిమానులు కోరుకుంటున్న వింటేజ్ చిరుని చూపించే విషయంలో.
This post was last modified on May 4, 2025 11:35 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…