మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని సంప్రదింపులు జరిపినప్పటికీ చివరికి బంతి నయనతార దగ్గర ఆగినట్టు ఫిలిం నగర్ టాక్. రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఆలస్యం చేయడానికి అనిల్ దగ్గర ఎక్కువ టైం లేదు. ఎందుకంటే 2026 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే మే మినహాయించి చేతిలో ఉన్న ఏడు నెలల్లో కాపీ సిద్ధమైపోవాలి. మధ్యలో విశ్వంభర విడుదల, ప్రమోషన్లు, ఈవెంట్లు ఇవన్నీ కలుపుకునే అంత టైం మాత్రమే మిగిలి ఉంది.
ఒకవేళ నయన్ కనక ఓకే అయితే ఈ కాంబోలో మూడో సినిమా అవుతుంది. మొదటిది సైరా నరసింహారెడ్డిలో భార్యగా చేసిన పాత్ర ఏమంత పేరు తీసుకురాలేదు. ఫలితం కూడా యావరేజ్ గానే రావడంతో ల్యాండ్ మార్క్ మూవీ అవ్వలేదు. రెండోది గాడ్ ఫాదర్. చిరంజీవి చెల్లెలుగా నయన్ పాత్ర బాగానే ఉన్నప్పటికీ బ్యాలన్స్ తప్పిన పొలిటికల్ కంటెంట్ ఆడియన్స్, ఫ్యాన్స్ ని పూర్తిగా మెప్పించలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ అంత బలంగా లేకపోవడంతో చాలా ఏరియాల్లో ఫ్లాప్ గా నిలిచింది. సో ఇప్పుడు హ్యాట్రిక్ అవ్వకుండా సూపర్ హిట్ బోణీ జరగాలి. ఫ్యాన్స్ కోరుకునేది అదే.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి వచ్చే దాకా వెయిట్ చేయాలి. ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది కానీ అది నిజం కాదట. ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు కానీ దానికి సంబంధించి క్లారిటీ లేదు. స్క్రిప్ట్ లాక్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం లొకేషన్ల వేట, క్యాస్టింగ్ పనుల్లో ఉన్నాడు. వేసవిలో రెగ్యులర్ షూట్ కు వెళ్లే ప్రతిపాదన ఉంది. విశ్వంభరకు సంబంధించి ఇంకొక్క పాట పెండింగ్ ఉంది. డబ్బింగ్ పనులున్నాయి. మొత్తానికి పండగ డెడ్ లైన్ పెట్టుకున్న రావిపూడికి పెద్ద బరువు బాధ్యతలే పడబోతున్నాయి. ముఖ్యంగా అభిమానులు కోరుకుంటున్న వింటేజ్ చిరుని చూపించే విషయంలో.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…