అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ ఏడాది రిలీజ్ కావడం గురించి బోలెడు అనుమానాలున్నాయి. మేలో వస్తానన్న హరిహర వీరమల్లు సంగతే ఇప్పటి దాకా తేలలేదు. అలాంటిది ఓజి సెప్టెంబర్ లో రావడం గురించి ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. పోనీ వచ్చే ఏడాది ఫలానా టైంకి విడుదలవుతుందని చెబితే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు కానీ అది కూడా జరగడం లేదు. ఇదిలా ఉంచితే కొద్దిరోజుల క్రితం గ్రౌండ్ జీరో ప్రమోషన్లలో భాగంగా దాంట్లో హీరోగా నటించిన ఇమ్రాన్ హష్మీ ఓజి గురించి ఒక బాంబ్ లాంటి అప్డేట్ పేల్చాడు.
అతను చెప్పిన ప్రకారం ఓజిలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సీన్ కూడా షూట్ జరగలేదు. కేవలం ఇతనొక్కడే అవసరమైన సన్నివేశాలు మాత్రమే దర్శకుడు సుజిత్ పూర్తి చేశాడు. ఇంకో నెల రెండు నెలల్లో పిలుపు రావొచ్చని ఇమ్రాన్ హష్మీ చెప్పడం చూస్తే బాలన్స్ బాగానే ఉందని అర్థమవుతోంది. ఇంత కీలక ఆర్టిస్టుతోనే కాంబినేషన్ ఇంకా మొదలు కాలేదంటే దాని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు పంపించి, అటుపై సెన్సార్, ప్రమోషన్లు వగైరాలకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వీడియో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ తిన్నంత పని చేశారు.
ఒకవేళ ఇమ్రాన్ హష్మీది తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అనుకుంటే ఎక్కువ డేట్లు అవసరం లేదనుకోవచ్చు. కానీ తన క్యారెక్టర్ తాలూకు అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలినప్పుడు అందులో స్పష్టంగా “ముంబైలో నీదో నాదో ఎవరిదో ఒక తల మాత్రమే ఉండాలని” పవన్ ని ఉద్దేశించి ఇమ్రాన్ చెప్పిన డైలాగుని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో ఆషామాషీ రోల్ అయితే కాదు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ 2025లోనే ఓజిని చూపించాలని ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on May 4, 2025 6:16 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…