Movie News

షాకింగ్ అప్డేట్ ఇచ్చిన OG విలన్

అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ ఏడాది రిలీజ్ కావడం గురించి బోలెడు అనుమానాలున్నాయి. మేలో వస్తానన్న హరిహర వీరమల్లు సంగతే ఇప్పటి దాకా తేలలేదు. అలాంటిది ఓజి సెప్టెంబర్ లో రావడం గురించి ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. పోనీ వచ్చే ఏడాది ఫలానా టైంకి విడుదలవుతుందని చెబితే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు కానీ అది కూడా జరగడం లేదు. ఇదిలా ఉంచితే కొద్దిరోజుల క్రితం గ్రౌండ్ జీరో ప్రమోషన్లలో భాగంగా దాంట్లో హీరోగా నటించిన ఇమ్రాన్ హష్మీ ఓజి గురించి ఒక బాంబ్ లాంటి అప్డేట్ పేల్చాడు.

అతను చెప్పిన ప్రకారం ఓజిలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సీన్ కూడా షూట్ జరగలేదు. కేవలం ఇతనొక్కడే అవసరమైన సన్నివేశాలు మాత్రమే దర్శకుడు సుజిత్ పూర్తి చేశాడు. ఇంకో నెల రెండు నెలల్లో పిలుపు రావొచ్చని ఇమ్రాన్ హష్మీ చెప్పడం చూస్తే బాలన్స్ బాగానే ఉందని అర్థమవుతోంది. ఇంత కీలక ఆర్టిస్టుతోనే కాంబినేషన్ ఇంకా మొదలు కాలేదంటే దాని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు పంపించి, అటుపై సెన్సార్, ప్రమోషన్లు వగైరాలకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వీడియో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ తిన్నంత పని చేశారు.

ఒకవేళ ఇమ్రాన్ హష్మీది తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అనుకుంటే ఎక్కువ డేట్లు అవసరం లేదనుకోవచ్చు. కానీ తన క్యారెక్టర్ తాలూకు అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలినప్పుడు అందులో స్పష్టంగా “ముంబైలో నీదో నాదో ఎవరిదో ఒక తల మాత్రమే ఉండాలని” పవన్ ని ఉద్దేశించి ఇమ్రాన్ చెప్పిన డైలాగుని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో ఆషామాషీ రోల్ అయితే కాదు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ 2025లోనే ఓజిని చూపించాలని ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Kumar

Recent Posts

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

10 minutes ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

29 minutes ago

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

46 minutes ago

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

2 hours ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

3 hours ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

4 hours ago