అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ ఏడాది రిలీజ్ కావడం గురించి బోలెడు అనుమానాలున్నాయి. మేలో వస్తానన్న హరిహర వీరమల్లు సంగతే ఇప్పటి దాకా తేలలేదు. అలాంటిది ఓజి సెప్టెంబర్ లో రావడం గురించి ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. పోనీ వచ్చే ఏడాది ఫలానా టైంకి విడుదలవుతుందని చెబితే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు కానీ అది కూడా జరగడం లేదు. ఇదిలా ఉంచితే కొద్దిరోజుల క్రితం గ్రౌండ్ జీరో ప్రమోషన్లలో భాగంగా దాంట్లో హీరోగా నటించిన ఇమ్రాన్ హష్మీ ఓజి గురించి ఒక బాంబ్ లాంటి అప్డేట్ పేల్చాడు.
అతను చెప్పిన ప్రకారం ఓజిలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సీన్ కూడా షూట్ జరగలేదు. కేవలం ఇతనొక్కడే అవసరమైన సన్నివేశాలు మాత్రమే దర్శకుడు సుజిత్ పూర్తి చేశాడు. ఇంకో నెల రెండు నెలల్లో పిలుపు రావొచ్చని ఇమ్రాన్ హష్మీ చెప్పడం చూస్తే బాలన్స్ బాగానే ఉందని అర్థమవుతోంది. ఇంత కీలక ఆర్టిస్టుతోనే కాంబినేషన్ ఇంకా మొదలు కాలేదంటే దాని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు పంపించి, అటుపై సెన్సార్, ప్రమోషన్లు వగైరాలకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వీడియో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ తిన్నంత పని చేశారు.
ఒకవేళ ఇమ్రాన్ హష్మీది తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అనుకుంటే ఎక్కువ డేట్లు అవసరం లేదనుకోవచ్చు. కానీ తన క్యారెక్టర్ తాలూకు అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలినప్పుడు అందులో స్పష్టంగా “ముంబైలో నీదో నాదో ఎవరిదో ఒక తల మాత్రమే ఉండాలని” పవన్ ని ఉద్దేశించి ఇమ్రాన్ చెప్పిన డైలాగుని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో ఆషామాషీ రోల్ అయితే కాదు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ 2025లోనే ఓజిని చూపించాలని ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on May 4, 2025 6:16 am
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…