జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ వార్ 2 విడుదల ఇంకో నూటా పది రోజుల్లో ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఇద్దరు హీరోల కాంబోలో షూట్ చేయాల్సిన పాట ఇంకా బాలన్స్ ఉంది. గాయం వల్ల బ్రేక్ తీసుకున్న హృతిక్ రేపో మాపో పూర్తిగా కోలుకోబోతున్నాడు. డాక్టర్ల సలహా మేరకు అనుకున్న దానికన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడంతో వార్ 2 యూనిట్ కు ఎదురు చూపులు తప్పలేదు. ఇదిలా ఉండగా వార్ 2 తెలుగు, తమిళ హక్కులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. పలు నిర్మాణ సంస్థలు మేమంటే మేమంటూ పోటీ పడుతున్న వైనం గురించి ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది.
కాకపోతే యష్ రాజ్ ఫిలింస్ ఇప్పుడప్పుడే బిజినెస్ డీల్స్ ముగించే ఉద్దేశంలో లేదట. టీజర్ సంగతేమో కానీ అసలు ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ పోస్టర్ వదల్లేదు. తారక్, హృతిక్ గెటప్స్ ఎలా ఉంటాయో సస్పెన్స్ లోనే పెట్టారు. కనీసం హీరోయిన్ కియారా అద్వానీ దర్శనం కూడా కాలేదు. చేతిలో ఉన్న తక్కువ టైంలో వార్ 2 బృందం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. పోటీలో ఉన్న రజనీకాంత్ కూలి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఏ కారణంగానూ వాయిదా పడే ఛాన్స్ లేదని చెన్నై టాక్. సో రెడీ అయ్యే విషయంలో వార్ 2 కన్నా కూలినే ఒక అడుగు ముందుండటం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే.
ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న సమాచారం మేరకు వార్ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఓ రెండు మూడు వారాలు బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత బ్రేక్ తీసుకుని వార్ 2 ప్రమోషన్లలో భాగమవుతాడు. జూన్ చివరి వారం నుంచి ఇవి మొదలుపెట్టాలని యష్ ఫిలింస్ ప్లానింగ్ లో ఉంది. రాజమౌళి తరహాలో దేశమంతా తిరిగి ఈవెంట్లు చేయబోతున్నారు. మొదటిసారి బాలీవుడ్, టాలీవుడ్ పెద్ద స్టార్లు కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ఎలాంటి క్యామియోలు లేవట.
This post was last modified on May 3, 2025 8:28 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…